పట్నంలో పల్లె వాతావరణం : శ్రీ ఆంధ్ర కళా స్రవంతి సంక్రాంతి సంబరాలు

విళ్లివాకం న్యూస్: చెన్నై కొరటూరు అగ్రహారం అన్నయ్ అవెన్యూలోని శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద పండుగ సంక్రాంతిని పల్లె వాతావరణంలో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 9:00 గంటలకు శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాములు హనుమంతుల వారికి ప్రత్యేక పూజలు శాస్త్రక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. గంగిరెద్దు విన్యాసాలు అలరించాయి. కొత్త మట్టి గుండెలలో పొంగలిని స్వామివారికి నైవేద్యంగా నివేదించారు. అలాగే లోక కళ్యాణార్థం పూజలు నిర్వహించారు. వంటలు ముగ్గుల పోటీలలో విజేతలను అభినందిస్తూ స్రవంతి అధ్యక్షులు జేయం నాయుడు, కార్యదర్శి జే శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ విన్ హరినాథ్, సిహెచ్ సాంబశివరావు, ఈ బాలాజీ, కమిటీ కార్యవర్గ సభ్యులు బహుమతులు అందజేశారు. శ్రీ సంస్కృతి వేదిక ఫౌండర్ ప్రెసిడెంట్ ఉప్పులూరి విజయలక్ష్మి పర్యవేక్షణలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం