లోక్ సభ స్పీకర్ ఎన్నికలో కొత్త ట్విస్ట్

లోక్ సభ స్పీకర్

     లోక్ సభ స్పీకర్ ఎన్నికలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. విపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. విపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ సురేశ్ నామినేషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్డీయే కూటమి పార్టీల తరఫున లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా ఓంబిర్లాకే మరోసారి అవకాశం దక్కింది. ఆయన మరికాసేపట్లో నామినేషన్ కూడా వేయనున్నారు. అయితే, స్పీకర్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ఓ మెలిక పెట్టింది. కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఇండియా కూటమి సభ్యులతో జరిపిన చర్చల్లో.. డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇస్తే స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీయే కూటమి దాదాపు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా పోటీకి సిద్ధమైనట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీంతో ఇప్పటి వరకూ ఏకగ్రీవమైన స్పీకర్ పదవి.. ఇప్పుడు తొలిసారి ఆ పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి