శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రోహిత్‌ శర్మ, కోహ్లీ, బుమ్రాలు దూరం

భారత్‌ ప్రస్తుతం జింబాబ్వేతో టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఆపై శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జులై 27 నుంచి ఆరంభం కానుండగా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆగష్టు 2 నుంచి మొదలవనుంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముగ్గురు స్టార్‌ ప్లేయర్స్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రాలు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రోహిత్‌ శర్మ 2023 డిసెంబరు నుంచి ఆరు నెలలుగా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ మధ్యలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నా.. ఆపై ఐపీఎల్‌ 2024, టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆడాడు. రోహిత్‌, కోహ్లీలు ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. లంకతో వన్డే సిరీస్‌ అనంతరం బంగ్లాదేశ్‌తో భారత్‌ రెండు టెస్టులు ఆడుతుంది. ఆ సిరీస్‌కు ఈ ఇద్దరు అందుబాటులోకి రానున్నారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ అనంతరం న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు భారత్‌ ఆడనుంది. ఇక ఈ ఏడాది చివర్లో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్తుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023-2025 ఫైనల్‌ లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లు రోహిత్‌ సేనకు కీలకం కానున్నాయి. రోహిత్‌ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యాలలో ఒకరు శ్రీలంక వన్డే సిరీస్‌లో జట్టును నడిపించే అవకాశముంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం