
విల్లివాకం న్యూస్: చెన్నై, ప్యారిస్, సౌకార్ పేట, ఎన్ఎస్సి బోస్ రోడ్డు, 147, గిరి కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ‘నిధి జ్యువెల్స్’ పేరిట కొత్త షోరూం ప్రారంభోత్సవం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. తంగుటూరి రామకృష్ణ, ఊరా బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో షోరూమును తంగుటూరి తాస్య, తన్విక్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంవి నారాయణ గుప్తా, త్రినాధ్ సహా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పలువురు పాల్గొన్నారు.
అలాగే చందన్, కుందన్ సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ తమ షోరూమ్ లో బంగారు, వెండి సామగ్రి, గిఫ్ట్ ఆర్టికల్స్ లభిస్తాయని, ఇవన్నీ వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.
……