
చెన్నై న్యూస్:పొంగల్ పండుగను అవకాశంగా తీసుకుని సైబర్ నేరగాళ్లు మరోసారి రంగంలోకి దిగారు. ‘ఫోన్పే గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్’ పేరుతో రూ.5,000 క్యాష్ రివార్డ్ ఇస్తున్నామని చెబుతూ వాట్సాప్లో నకిలీ లింకులు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.
ఆ లింక్పై క్లిక్ చేసిన కొంతమందికి వెబ్పేజీ ఓపెన్ కాకుండా 404 ఎర్రర్ కనిపిస్తుండగా, మరికొందరికి ఆ మెసేజ్ను 5 వాట్సాప్ గ్రూపులు లేదా 15 మంది స్నేహితులకు షేర్ చేయాలన్న సూచనలు వస్తున్నాయి. అలాగే “ఇది ఫేక్ అనుకున్నాను కానీ నిజంగా డబ్బులు వచ్చాయి” అంటూ ఆకర్షణీయమైన ఫేక్ టెస్టిమోనియల్స్ కూడా అందులో ఉంటున్నట్లు సైబర్ నిపుణులు వెల్లడించారు.
ఇలాంటి లింకులను ఓపెన్ చేయడం వల్ల వ్యక్తిగత వివరాలు లీక్ కావడం, బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావడం, ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్పే సంస్థ నుంచి అధికారికంగా ప్రకటించని ఆఫర్లు పూర్తిగా నకిలీవేనని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ మెసేజ్ అందుకున్న వారు వెంటనే డిలీట్ చేయాలని, ఇతర గ్రూపులు లేదా స్నేహితులకు కూడా ఈ స్కామ్పై అవగాహన కల్పించాలని సైబర్ అధికారులు సూచిస్తున్నారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.