‘మన శంకర వరప్రసాద్’ నిడివి ఫిక్స్… ఓవర్సీస్‌లో భారీ టార్గెట్

కోడంబాకం న్యూస్:మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం **‘మన శంకర వరప్రసాద్ గారు’**పై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నిడివి 2 గంటలు 38 నిమిషాలుగా ఖరారైనట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్టర్ ద్వారా వెల్లడించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
బిజినెస్ పరంగా ఈ చిత్రం భారీ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నయనతార కీలక పాత్రలో నటించడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగిందని విశ్లేషిస్తున్నారు. ఓవర్సీస్ హక్కులకు సంబంధించి రూ.20 కోట్ల డీల్ ఖరారైనట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 3.5 మిలియన్ డాలర్లు, మొత్తం ఓవర్సీస్ మార్కెట్‌లో 4.75 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్, కేథరిన్ త్రేజా కూడా కీలక పాత్రల్లో కనిపించనుండటంతో కాంబినేషన్‌పై మంచి బజ్ నెలకొంది. మరోవైపు చిరంజీవి 20 ఏళ్ల క్రితం లుక్‌ను తలపించే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి