
కోడంబాకం న్యూస్:మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం **‘మన శంకర వరప్రసాద్ గారు’**పై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నిడివి 2 గంటలు 38 నిమిషాలుగా ఖరారైనట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్టర్ ద్వారా వెల్లడించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
బిజినెస్ పరంగా ఈ చిత్రం భారీ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నయనతార కీలక పాత్రలో నటించడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగిందని విశ్లేషిస్తున్నారు. ఓవర్సీస్ హక్కులకు సంబంధించి రూ.20 కోట్ల డీల్ ఖరారైనట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 3.5 మిలియన్ డాలర్లు, మొత్తం ఓవర్సీస్ మార్కెట్లో 4.75 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్, కేథరిన్ త్రేజా కూడా కీలక పాత్రల్లో కనిపించనుండటంతో కాంబినేషన్పై మంచి బజ్ నెలకొంది. మరోవైపు చిరంజీవి 20 ఏళ్ల క్రితం లుక్ను తలపించే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.