ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఉప రాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు.

జగదీప్ ధన్‌ఖడ్ 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 1990-91లో కేంద్రమంత్రిగా, 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సేవలందించారు.

కిసాన్ పుత్రుడిగా దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందిన ఆయన, జనతాదళ్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గతంలో శాసనసభ, లోక్‌సభ సభ్యుడిగానూ పనిచేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం