
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఉప రాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు.
జగదీప్ ధన్ఖడ్ 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 1990-91లో కేంద్రమంత్రిగా, 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా సేవలందించారు.
కిసాన్ పుత్రుడిగా దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందిన ఆయన, జనతాదళ్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గతంలో శాసనసభ, లోక్సభ సభ్యుడిగానూ పనిచేశారు.