టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు

విల్లివాకం న్యూస్: శ్రీ భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చెన్నై టి.నగర్ లో గల తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆలయ ప్రాంగణంలో భక్తి గీతాలతో నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి, ఏఈఓ పార్థసారథి, గౌరవ అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కె. అనిల్ కుమార్ రెడ్డి, ప్రత్యేక అతిథిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపి విచ్చేసారు.

ముందుగా అతిధులను నిర్వాహకులు సత్కరించారు. అలాగే, ఇందులో శ్రీ భారత్ కళ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, డైరెక్టర్, గురు నృత్యకారిణి రోజా రాణి, డైరెక్టర్, ఆర్గనైజర్ దుర్గా నటరాజ్, సపోర్టింగ్ డైరెక్టర్ ప్రణతి రెడ్డి, శ్రీ విశ్వ కామాక్షి కళాలయ గురు డాక్టర్ నీరజ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఇందులో విద్యార్థినులు ఆర్ రాజేశ్వరి, ఎస్ క్రిష్నిత, ఆర్ లక్ష్య, నేత్ర ప్రసన్నకుమార్ తదితరుల నృత్య రీతులు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి అనేకమంది హాజరయ్యారు. విద్యార్థినులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి