ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ – చంద్రబాబు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ

అమరావతి న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక ముందడుగు పడింది. ఎస్సీ రిజర్వేషన్ల పంపిణీలో సమానత్వాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడానికి ఏపీ క్యాబినెట్ ఆర్డినెన్స్‌ను ప్రకటించింది.

ఈ ఆర్డినెన్స్ ద్వారా, ఇప్పటిదాకా రిజర్వేషన్ల లాభాలు అందని ఎస్సీ ఉపవర్గాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగు వేసింది. గతంలో ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమాల ప్రభావంతో ఈ అంశం మళ్లీ ప్రాధాన్యతకు వచ్చింది. ఆయన అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, తగిన చర్యలు తీసుకున్నారు.

ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా, జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిని అసెంబ్లీలో చర్చించి ఆమోదించిన అనంతరం ఇప్పుడు అధికారికంగా ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.

ఈ చర్యతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా తిరిగి ప్రారంభం కానుంది. ముఖ్యంగా, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఐదు రోజుల్లో వెలువడనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. తదుపరి ఇతర ఉద్యోగ ప్రకటనలూ త్వరలో వెలువడనున్నాయి.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి