ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ – చంద్రబాబు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ

అమరావతి న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక ముందడుగు పడింది. ఎస్సీ రిజర్వేషన్ల పంపిణీలో సమానత్వాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడానికి ఏపీ క్యాబినెట్ ఆర్డినెన్స్‌ను ప్రకటించింది.

ఈ ఆర్డినెన్స్ ద్వారా, ఇప్పటిదాకా రిజర్వేషన్ల లాభాలు అందని ఎస్సీ ఉపవర్గాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగు వేసింది. గతంలో ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమాల ప్రభావంతో ఈ అంశం మళ్లీ ప్రాధాన్యతకు వచ్చింది. ఆయన అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, తగిన చర్యలు తీసుకున్నారు.

ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా, జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిని అసెంబ్లీలో చర్చించి ఆమోదించిన అనంతరం ఇప్పుడు అధికారికంగా ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.

ఈ చర్యతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా తిరిగి ప్రారంభం కానుంది. ముఖ్యంగా, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఐదు రోజుల్లో వెలువడనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. తదుపరి ఇతర ఉద్యోగ ప్రకటనలూ త్వరలో వెలువడనున్నాయి.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం