రామేశ్వరంలో కొత్త పంబన్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు

చెన్నై న్యూస్: రామేశ్వరంలో కొత్త పంబన్ రైల్వే వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు:

“నా ప్రియమైన తమిళ మిత్రులారా, ఈ రోజు శ్రీరామ నవమి — ఒక పవిత్ర దినం. తమిళ సాహిత్యంలోనూ రాముని ప్రస్తావన ఉంది. ఈ పవిత్ర భూమి రామేశ్వరంలోనుండి భారతదేశ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈరోజు రామనాథ స్వామి ఆలయంలో పూజలు చేసే సమయంలో నాకు ఆధ్యాత్మిక భావనలు కలిగాయి. ఈ విశిష్ట రోజున రూ. 8,300 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను ప్రారంభించే అవకాశం దక్కింది.

భౌగోళిక విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత ఒకదానికొకటి ఎలా పూరకంగా పనిచేస్తాయో భారతరత్న అబ్దుల్ కలాం గారి జీవితం మనకు చూపిస్తుంది. అదే విధంగా, రామేశ్వరం ప్రాంతంలో నిర్మించబడిన ఈ కొత్త పంబన్ వంతెన కూడా సాంకేతికతను మరియు సంప్రదాయాన్ని కలిపే ప్రయత్నం. వేల సంవత్సరాలుగా ప్రసిద్ధి గాంచిన ఈ నగరం ఇప్పుడు 21వ శతాబ్దపు ఇంజినీరింగ్ అద్భుతంతో మరింత ప్రాముఖ్యతను పొందుతోంది. ఈ వంతెన నిర్మాణానికి కృషి చేసిన ఇంజినీర్లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.”

గత 10 సంవత్సరాలలో తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువ నిధులను అందించినట్లు ప్రధాని పేర్కొన్నారు. రామేశ్వరం ప్రాంతంలో రూ. 8,300 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే రూ. 100 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ఇటువంటి ప్రాజెక్టులలో భాగంగా, వాలాజాపేట – రాణిపేట మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విల్లుపురం – పుదుచ్చేరి మధ్య 4 లైన్ల రహదారిని జాతికి అంకితం చేశారు. పూండియంకుప్పం–చట్టనాథపురం, కుంభకోణం–చోళపురం–తంజావూరు మధ్య నాలుగు లేన్ల రహదారులను కూడా దేశానికి అంకితం చేశారు.
……………

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి