టీమిండియాకు మరో ఐసీసీ ట్రోఫీ – న్యూజిలాండ్‌పై విజయం, కోహ్లీ-రోహిత్ సంబరాలు!

లాహోర్: టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన పైచేయిని నిరూపించుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.

ఫైనల్లో టీమిండియా అదరగొట్టిన ప్రదర్శన

ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రేస్‌వెల్ (53*) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (2/40), వరుణ్ చక్రవర్తి (2/45) మెరుగైన ప్రదర్శన చేశారు.

ఆనంతరం భారత జట్టు 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (83) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (34*) జట్టును విజయ తీరాలకు చేర్చారు.

సెలబ్రేషన్స్‌లో కోహ్లీ-రోహిత్ దాండియా డాన్స్!

ఈ విజయంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. చివరి బౌండరీ కొట్టిన రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్, హర్షిత్‌లతో కలిసి గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లతో దాండియా ఆడుతూ అభిమానులను అలరించారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కోహ్లీ హగ్ చేసుకుంటూ గెలుపును ఆస్వాదించారు.

ఈ సంబరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియా మరోసారి చారిత్రక విజయం సాధించడంతో భారత అభిమానులు ఆనందంతో మునిగిపోయారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి