చెస్ చరిత్ర సృష్టించిన గుకేశ్‌కు ప్రధాని మోదీ అభినందనలు

చెన్నై న్యూస్:సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల గుకేశ్, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను (7.5 – 6.5 పాయింట్లు) ఓడించి విజేతగా నిలిచాడు. దీని ద్వారా గుకేశ్ ప్రపంచ చెస్ చరిత్రలో ఈ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.

గుకేశ్‌కు రూ.11½ కోట్ల ప్రైజ్ మనీతో పాటు ప్రైజ్ ట్రోఫీ, మెడల్ లభించాయి. అంతేకాక, తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల ప్రైజ్ మనీని కూడా ప్రకటించారు.

పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు గుకేశ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ గుకేశ్‌కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

ఫైనల్ మ్యాచ్‌లో డింగ్ లిరెన్ సంతకం చేసిన చెస్ బోర్డును గుకేశ్ ప్రధాని మోదీకి సావనీర్‌గా బహూకరించాడు.

దీనికి సంబంధించిన ట్వీట్‌లో, PM మోదీ తన X (మాజీ ట్విట్టర్) ఖాతాలో, “చెస్ ఛాంపియన్ గుకేశ్ భారతదేశం గర్వించే వ్యక్తి. నేను అతనితో కొన్ని సంవత్సరాలుగా సన్నిహితంగా ఉన్నాను. అతని సంకల్పం, నిబద్ధత అద్భుతం. కొన్ని సంవత్సరాల క్రితం అతను ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా పిన్న వయస్కుడిగా అవతరించగలడని చెప్పడం గుర్తుంది. అతని కృషితో ఆ అంచనా నిజమైంది,” అంటూ పేర్కొన్నారు.

 

గుకేశ్ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం