నిబద్ధత, నిజాయితీకి మారుపేరు నల్లి కుప్పుస్వామి

విల్లివాకం న్యూస్: పద్మశ్రీ నల్లి కుప్పుస్వామి నిబద్ధత, నిజాయితీకి మారుపేరని పలువురు వక్తలు వెల్లడించారు. బ్రహ్మ గాన సభ ఆధ్వర్యంలో పద్మశ్రీ నల్లి కుప్పుస్వామి చెట్టియార్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలలో ఆరు పుస్తకాల ఆవిష్కరణ శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. దీనికి చెన్నై ఆర్ఎ పురం, చెట్టినాడు విద్యాశ్రమ్ ఆడిటోరియం వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్, డైరెక్టర్, ఎన్ రవి అధ్యక్షత వహించారు. మద్రాసు యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్, ప్రొఫెసర్, హెచ్ఒడి, డాక్టర్ వై మణికండం మొదటి ప్రతులను అందుకున్నారు. అనంతరం ఆయన నల్లి ది మాన్ ది బ్రాండ్, జ్ఞానం తంద జ్ఞానానందర్, సహృదయ నల్లి, తేన్ గూడు తదితర పుస్తకాల గురించి వివరించారు. ఇందులో నల్లి కుప్పు స్వామి మంచితనం, నిరాడంబరత గురించి కొనియాడారు. విద్యాదాతగా, అనేకమంది జీవితాలకు వెలుగునిచ్చిన స్ఫూర్తి ప్రదాతగా పేరు గడించినట్లు తెలిపారు. డాక్టర్ ఆర్ నటరాజన్ మాట్లాడుతూ నల్లితో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో సహృదయ నల్లి పుస్తకావిష్కరణ జరిగింది. దీనిని ఎన్ వి సుబ్బారావు అనువదించారు.

గోటేటి వెంకటేశ్వరరావు ప్రముఖాంద్ర తరపున పబ్లిష్ చేశారు. పీఎం హేమావతి, ఎస్ రవిచంద్రన్, నటుడు పార్దిపన్, తదితరులు హాజరయ్యారు. ఈ
కార్యక్రమంలో నగరానికి చెందిన అనేకమంది తమిళ, తెలుగు ప్రముఖులు పాల్గొని నల్లి కుప్పు స్వామిని సత్కరించారు. అలాగే , నల్లి కుప్పు స్వామి తనకు సహకరించిన అందరిని ఉచిత రీతిన సత్కరించారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి