రేడియో ఎఫ్ఎం విభాగంలో అవకాశాలపై అవగాహన

విల్లివాకం న్యూస్: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సిటీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కన్సల్టేటివ్ కమిటీ (సిసిసిసిసి) ఆధ్వర్యంలో బుధవారం చెన్నైలో రేడియో ఎఫ్ఎం విభాగంలో అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి భారత ప్రభుత్వ సమాచార, ప్రసారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్. ఎల్. మురుగన్ అధ్యక్షత వహించారు. భారతదేశంలోని 234 నగరాల్లో 730 ఎఫ్ఎం రేడియో ఛానెల్‌లు అందుబాటులో ఉంచేందుకు రాబోయే ఎఫ్ఎం ఫేజ్ III వేలం కోసం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఆహ్వానిత దరఖాస్తులను (ఎన్ఐఏ) జారీ చేసింది. వేలం కోసం ఔట్‌రీచ్ ప్రయత్నాలలో భాగంగా, ఎఫ్ఎం రేడియో లైసెన్స్‌లను పొందేందుకు ఆసక్తిగల వ్యాపారులు, వ్యవస్థాపకులు మరియు భారతీయ కంపెనీలతో నిమగ్నమవ్వడానికి మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ప్రెసిడెంట్ డాక్టర్ విఎల్ ఇందిరా దత్ స్వాగతోపన్యాసం చేశారు. నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ప్రెసిడెంట్, సయ్యద్ మునీర్ అహ్మద్, తమిళ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ప్రెసిడెంట్, చోళ నాచియార్ రాజశేఖర్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రగతి సాధిస్తున్నట్లు తెలిపారు. 100 రోజులలో 15 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే, కేవలం 100 రోజులలో 234 ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు అనుమతి నిచ్చినట్లు తెలిపారు.

 

ఎఫ్ఎం కవరేజీ లేని ప్రాంతాలలో చిన్న పట్టణాలకు సైతం ఈ స్టేషన్లు ఏర్పాటు జరుగుతున్నట్లు తెలిపారు. ఆకాశవాణి నుంచి ప్రారంభమైన ప్రస్థానం డిజిటల్ వరకు సాగినట్లు పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, I అండ్ B (బ్రాడ్‌కాస్టింగ్-1), సంజీవ్ శంకర్ ఎఫ్ఎం రేడియో మరియు దరఖాస్తుల వివరాలపై వివరణాత్మక ప్రెజంటేషన్ అందించారు. అనంతరం సభికులతో ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది చివరిగా హెచ్సిసి ప్రెసిడెంట్, లినేష్ సనత్ కుమార్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిఆర్ కమిటీ చైర్మన్, కేఎన్ సురేష్ బాబు, సభ్యులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
………………..

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం