రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన కేతిరెడ్డి

చెన్నై న్యూస్ :సినీ హీరో రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో నేడు కేపి.హెచ్.బి కాలనీ ఇందు ఫార్చ్యూన్ ఫిల్డ్స్ లోని ఆయన నివాసంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, ఎం.ఎం.ఆర్ క్రియేషన్స్ చైర్మన్ మంద మల్లికార్జున్ రెడ్డి తో కలిసి రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం గాయత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ తో తమకు ఎనలేని బంధం ఉందని, నవోదయం అనే సినిమా నుండి తమకు పరిచయం ఏర్పడిందని వారి కుటుంబ సభ్యులతో కూడా మంచి అనుబంధంగా ఉందని అన్నారు. చిన్న వయసులోనే గాయత్రీ కి ఇలా జరగడం ఎంతో బాధను కలిగించింది అందర్నీ నవ్వించే రాజేంద్రప్రసాద్ కుటుంబంలోనే నేడు ఈ విషాద ఘటన జరగడం ఎంతో బాధాకరమైన విషయమని ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు.

బైట్: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి(తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు)
………..

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి