భూసారపు వెంకటేశ్వరరావు మృతి

విల్లివాకం న్యూస్: ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు భూసారపు వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి చెన్నైలో మృతి చెందారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. 1964లో చెన్నై చిత్ర సీమకు పరిచయం అయిన ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ చిత్రాలలో అనేకం నటించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 1,000 చిత్రాలకు పైగా పనిచేశారు. సినీ గీత రచయిత రాజశ్రీ తో కలిసి రచయితగా పనిచేశారు. డబ్బింగ్ ఆర్టిస్టులు సాయికుమార్, రత్నకుమార్, నారాయణ బాబు, గౌరీ ప్రియ, లక్ష్మిలను ఎంతగానో ప్రోత్సహించారు. ఈయన నటుడు పీజే శర్మ సమకాలీనులు. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరు చెన్నై, హైదరాబాద్ లలో నివసిస్తుండగా మరొకరు వర్జీనియా (యూఎస్)ఏ లో ఉన్నారు. చెన్నై కోడంబాక్కం విశ్వనాథపురం లోని స్వగృహంలో కన్నుమూసిన ఆయన భౌతిక కాయానికి చిత్ర రంగానికి చెందిన పలువురు నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 12:00 గంటలకు చెన్నైలో జరిగాయి.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి