భూసారపు వెంకటేశ్వరరావు మృతి

విల్లివాకం న్యూస్: ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు భూసారపు వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి చెన్నైలో మృతి చెందారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. 1964లో చెన్నై చిత్ర సీమకు పరిచయం అయిన ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ చిత్రాలలో అనేకం నటించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 1,000 చిత్రాలకు పైగా పనిచేశారు. సినీ గీత రచయిత రాజశ్రీ తో కలిసి రచయితగా పనిచేశారు. డబ్బింగ్ ఆర్టిస్టులు సాయికుమార్, రత్నకుమార్, నారాయణ బాబు, గౌరీ ప్రియ, లక్ష్మిలను ఎంతగానో ప్రోత్సహించారు. ఈయన నటుడు పీజే శర్మ సమకాలీనులు. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరు చెన్నై, హైదరాబాద్ లలో నివసిస్తుండగా మరొకరు వర్జీనియా (యూఎస్)ఏ లో ఉన్నారు. చెన్నై కోడంబాక్కం విశ్వనాథపురం లోని స్వగృహంలో కన్నుమూసిన ఆయన భౌతిక కాయానికి చిత్ర రంగానికి చెందిన పలువురు నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 12:00 గంటలకు చెన్నైలో జరిగాయి.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం