
కోడంబాకం న్యూస్ :మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ విడుదలైన అతి తక్కువ సమయంలోనే భారీ రికార్డులను సొంతం చేసుకుంది.
సినిమా రిలీజైన కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. పండుగ సీజన్ కావడంతో పాటు చిరంజీవి మార్క్ ఫుల్ లెంగ్త్ వినోదం ప్రేక్షకులను థియేటర్లకు భారీగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకు అద్భుత స్పందన లభిస్తోంది.
బుక్ మై షో వేదికగా ఈ చిత్రం అత్యంత వేగంగా 20 లక్షల టికెట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుని రీజనల్ సినిమాల రికార్డుల్లో చోటు సంపాదించింది. నాలుగో రోజు కలెక్షన్లు కూడా ఓపెనింగ్ డే స్థాయిలోనే ఉండటం విశేషంగా మారింది. ఒక్క గురువారం రోజే దాదాపు 4.24 లక్షల టికెట్లు అమ్ముడవ్వడం సినిమాపై ఉన్న క్రేజ్ను స్పష్టంగా చూపిస్తోంది.
చాలా కాలం తర్వాత చిరంజీవి తన ట్రేడ్మార్క్ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, అనిల్ రావిపూడి కథనంలో భావోద్వేగాలు–వినోదం సమతుల్యంగా ఉండటం సినిమాకు ప్లస్గా మారింది. దీంతో రిపీట్ ఆడియన్స్ సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది.
అదనపు షోలు, మరిన్ని స్క్రీన్లు పెంచినా చాలా ప్రాంతాల్లో ఇంకా హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కనుమ రోజున థియేటర్ల వద్ద టికెట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీరెన్స్, నయనతార నటన ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
లాంగ్ వీకెండ్ ముగిసినప్పటికీ సినిమాకు ఉన్న జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ వంటి భారీ చిత్రాలతో పోటీ ఉన్నా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బ్రేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
………….