ఆవడి న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తిరువల్లూరు జిల్లా ఆవడి లోని ఇశ్రాయేలు పేట తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం ఉదయం ఎంతో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలలో నిర్వహించారు. సంఘ కాపరి రెవ విజయ శేఖర్ అధ్యక్షత వహించగా అతిథిగా దైవ సేవకురాలు సిస్టర్ జ్యోతి దైవ వాక్యాన్ని బోధించి, బైబిల్ లో ఉన్న స్త్రీలు వారి యొక్క దైవికమైన ఉద్దేశాలను వివరించారు. అలాగే స్త్రీల సమాజం తరఫున దాదాపు₹30 వేలు తో పెయింటింగ్ పనులు చేయించారు.
గ్రామ పంచాయతీ తరపున మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను సత్కరించారు. అనంతరం ప్రత్యేక ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రెసిడెంట్ ఎన్ విజయ్ కుమార్, సెక్రెటరీ ఎం దేవదాసు, వైస్ ప్రెసిడెంట్ ఎన్ థామస్, సంఘ పెద్దలు కె జోసెఫ్, బి ప్రేమ్ కుమార్, ట్రెజరర్ పి జబరాజ్, చర్చి స్త్రీల సమాజం ప్రెసిడెంట్ ఎం మరియమ్మ, సెక్రెటరీ జి వి వివేకవతి, ట్రెజరర్ పి భాగ్యమ్మ, తో పాటు కమిటీ సభ్యులు, యవ్వనస్తులు, చర్చి విశ్వాసులు, పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదంగా నిర్వహించారు.

Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com