మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి, యువత చరిత్రలో తెలుసుకోవాలి…

*చెన్నైలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

చెన్నై: భారత స్వాతంత్ర సమరంలో మహనీయుల త్యాగాలను మరువకూడదని, యువత చరిత్రను తెలుసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. చెన్నై మహా నగరంలోని కొడుంగయూర్ సీతారామ నగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు.సంఘం ప్రెసిడెంట్ బి. సురేష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల గొప్పతనాన్ని గుర్తు చేశారు.

అనంతరం సంఘ పెద్దలు ఎర్రభనేని పట్టాభిరామయ్య, వంజరపు శివయ్య, బి. సుబ్బారావు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. వారు యువతకు స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్ఫూర్తిగా నిలిపే విధంగా చరిత్రను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సంక్షేమ సంఘం సెక్రటరీ పి. లక్ష్మణరావు, ట్రెజరర్ డి. పిచ్చేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎన్. చంద్రశేఖర రెడ్డి, ఏ. దుర్గాప్రసాద్, సహాయ కార్యదర్శులు కే. శ్రీనివాస కుమార్, బి. శ్రీధర్ తదితరులు పర్యవేక్షించారు.తెలుగు ప్రజలతో పాటు కమిటీ సభ్యులు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా యువత దేశ చరిత్రను తెలుసుకోవడంతో పాటు, మహనీయుల త్యాగాలను తమ జీవితాలకు స్ఫూర్తిగా మార్చుకోవాలని వక్తలు సందేశం ఇచ్చారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి