విల్లివాకం న్యూస్: మద్రాసు ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసి సంక్షేమ సంఘం, చెన్నై, వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్, చెన్నై సహకారంతో శనివారం చెంగల్పట్టు జిల్లా, పాలేశ్వరంలోఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ కొల్లి మహేష్, డాక్టర్ ఆగ్నెస్ జార్జ్, డాక్టర్ కొల్లి రాజు, డాక్టర్ పి.రాధమ్మ, డాక్టర్ నేతాజీ, స్టాఫ్ నర్స్ మెర్లిన్ పాల్గొన్నారు.మొత్తం 116 మంది రోగులకు ఉచిత కన్సల్టేషన్, ఉచిత బ్లడ్ షుగర్ పరిశోధనలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ శిబిరానికి డాక్టర్ సంతోష్ కిషోర్ చంద్రశేఖర్ స్పాన్సర్ చేశారు. బ్రదర్ బెంజి కుమార్ మరియు నటరాజన్ ఈ శిబిరాన్ని సమర్ధవంతంగా సమన్వయం చేసారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com