ప్రేమ సామ్రాజ్యాన్ని వెలిగించిన క్రీస్తు పునరుత్తాన మహోత్సవం

టి నగర్ న్యూస్ :చెన్నై, బ్రాడ్వే104 ప్రాంతంలోని సెయింట్ గాబ్రియేల్ స్కూల్ ప్రాంగణంలో సీబీఎఫ్ యువజన బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడిన క్రీస్తు మరణ–పునరుత్తాన మహోత్సవం విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సీబీఏఫ్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు మాట్లాడుతూ, “యేసు క్రీస్తు మరణం, పునరుత్థానం చరిత్రాత్మక ఘటనలు. దీనికి చరిత్ర, పురావస్తు ఆధారాలు స్పష్టంగా మద్దతు ఇస్తున్నాయి. యేసు సమస్త మానవాళిని ప్రేమించి తన ప్రాణాన్ని త్యాగం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమతో జీవించాలి” అని ప్రజలకు సందేశం అందించారు.

ఈ సందర్భంలో నేపోలియన్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ, “మేము అనేకులు చంపి రాజ్యాలు సాధించాం. కానీ యేసు తన ప్రేమతో రక్తం కార్చి రాజ్యం నిర్మించారు. ఆయన ప్రేమ సామ్రాజ్యం, అది ఎప్పటికీ నిలిచే రాజ్యం” అని వివరించారు.

అలాగే స్వామి వివేకానంద రాసిన “జ్ఞాన దీపం” గ్రంథంలో క్రీస్తు గురించిన వ్యాఖ్యలను ప్రదర్శిస్తూ డాక్టర్ వసంత బాబు ప్రజానీకానికి ఆత్మవిశ్వాసం నింపారు.

ఈ కార్యక్రమంలో కవి సుధా రమణి రచించిన “అపారమైనది నీ కృప” అనే పాటకు జడ జస్టిన్ పాల్ సంగీతం అందించగా, విశ్వ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జడ విశ్వవాణి ఆవిష్కరించారు.

పదిహేను ఏళ్లకే సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జడ జస్టిన్ పాల్ ప్రతిభను ప్రశంసిస్తూ రైట్ రెవరెండ్ రిక్టర్ ఆనందా గారు అతిథిగా పాల్గొన్నారు. సువార్త గాయకులు కె. ఆనంద్ బాబు, జె. జస్టిన్ పాల్ నేతృత్వంలో క్వయర్ పాడిన గీతాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశాయి.జి. రవి వందన సమర్పణతో ఈ మహోత్సవం ముగిసింది.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి