తెలుగు ప్రజల ఐక్యతతోనే భవిష్యత్తు : ఆచార్య సీఎం కే రెడ్డి

టీ నగర్ న్యూస్: కులమత భేదాలు లేకుండా తమిళనాడులో నివసించే తెలుగు ప్రజలంతా ఐక్యతతో ఉంటే, మన భాషను కాపాడుకుంటూ, మన హక్కులను సాధించుకోవచ్చని అఖిల భారత తెలుగు సమైక్య అధ్యక్షుడు ఆచార్య సీఎం కే రెడ్డి పిలుపునిచ్చారు.

చెన్నై సమీపంలోని పుళల్ కావంగరై తెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వ వసు నామ సంవత్సర ఉగాది 2025 పేరిట తొమ్మిదవ ఉగాది వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీదేవి భూదేవి సమేత కార్య మనికల పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.అనంతరం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ జెట్ సమాజం మండపంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆచార్య సీఎం కే రెడ్డి, అతిథులుగా ఏ ఐ టి ఎఫ్ జనరల్ సెక్రటరీ నందగోపాల్, వైస్ ప్రెసిడెంట్ లయన్ విజి జయకుమార్, ద్రావిడ దేశం పార్టీ అధ్యక్షుడు వి కృష్ణారావు, తమిళనాడు కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తాళ్లూరి సురేష్ పాల్గొన్నారు.

వేడుకల్లో ఆరుద్ర నాట్యాలయం, శ్రీ గృహన్ జాలి భరతనాట్య అకాడమీ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆచార్య సీఎం కే రెడ్డి మాట్లాడుతూ, తమిళనాడులో రెండవ అత్యధికంగా మాట్లాడే భాష అయినా తెలుగువారికి సమాన హక్కులు అందటం లేదని, అవి సాధించేందుకు ఐక్యత అవసరమని తెలిపారు. పుళల్ కావంగరై తెలుగు సంక్షేమ సంఘం ప్రతి ఏడాది ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎం అరుల రాశి అనే విద్యార్థికి చదువు కోసం వి. బాబూజీ, కవిత ₹20వేలు సహాయం చేశారు.
ఉగాది వేడుకల్లో విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని సంఘ గౌరవ అధ్యక్షుడు లయన్ జి మురళి, చీఫ్ కోఆర్డినేటర్ జివి రామకృష్ణ, సంఘ ప్రెసిడెంట్ పి నరసింహారావు, సెక్రటరీ ఎం చిట్టిబాబు, ట్రెజరర్ ఎం మునుస్వామి, ఉపాధ్యక్షులు బి కృష్ణయ్య, డి గోపాలకృష్ణ, ఐ వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీలు లయన్ బి బాలాజీ, వి బాపూజీ, బి నాగరాజు, సలహాదారులు జి వెంకయ్య, బి గురువారెడ్డి, బి దామోదర చెట్టి, ఎం వాసు, బి నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షించారు. తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా ఉగాది వేడుకలను జరుపుకున్నారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి