విల్లివాకం న్యూస్: చెన్నై, తిరువల్లికేనిలోని శ్రీరామదాసాంజనేయ స్వామి ఆలయము 47 వ సంవత్సరపు ఆంజనేయ స్వామి మహోత్సవములు వేడుకగా జరుగుతున్నవి. 16.1.2026వ తేదీ ఉదయం 6:00 గంటలకు మూలికల అభిషేకము బాగా జరిగినది. సాయంత్రం 6:00 గంటలకు పలు పండ్లతో అలంకరణ చేసి అభిషేకము చేశారు. ఇందులో చాలామంది భక్తులు హాజరయ్యారు. రాత్రి 7:00 గంటలకు సహపంక్తి భోజనము జరిగింది. కార్యక్రమానికి పుర ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం శ్రీ రామదాసాంజనేయ ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామ సంక్షేమ సంఘ సభ్యులు, సీతారామాంజనేయ భజన బృందం సభ్యులు, యువకులు కలిసి జయప్రదంగా చేశారు. చివరిగా కైంకర్యము చేసిన వారిని గ్రామ సంక్షేమ సంఘం పెద్దలు, అన్ని దేవాలయ కార్యనిర్వాకులు, ఉత్సవ కమిటీ వారు గౌరవించారు.

Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com