అన్నా నగర్ న్యూస్ : శనివారం సాయంత్రం ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర సంచాలకులు, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ , అఖిలభారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ఆచార్య సీఎంకే రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భాషా పరిరక్షణ, అభివృద్ధి, పలు భాషాపరమైన సమస్యలపై చర్చ జరిపారు.
భారతీయ భాషల ప్రాముఖ్యతను పురస్కరించుకుని, ఫిబ్రవరి 21న జరగనున్న ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ రోజు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ఆచార్య సీఎంకే రెడ్డి గారిని ఆహ్వానించారు.ఈ సమావేశం భాషా పరిరక్షణలో కొత్త మార్గదర్శకాలను అందించే దిశగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com