Logo
Date of Publish : 11 July 2024, 8:20 pm
Editor : CH. MUKUNDARAO

పల్లె వెలుగు బస్ రేట్లలో రూ.10అదనం తగునా!!

పౌర సంక్షేమ సంఘం డిమాండ్

కాకినాడ, జూలై 11 : పల్లె వెలుగు బస్సుల్లో అల్ట్రా బస్ వేరయా అన్నట్టుగా రూ.10ల అదనపు ధర వసూలు చేయడం దోపిడీ చందంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. కాకినాడ జగన్నాధపురం నుండి ద్రాక్షారామకు వెళ్ళే పల్లె వెలుగు బస్ రూ.30ల టికెట్ ధర వసూలు చేస్తుండగా అల్ట్రా పల్లె వెలుగు బస్ లో రూ.40 వసూలు చేయడం తగదన్నారు. కొత్త బస్సు అయినంత మాత్రాన అదనంగా పది రూపాయలు రుబాబుగా వసూలు చేస్తున్న విధానం సవరించాల్సిన అవసరం వుందని డిమాండ్ చేశారు. సామాన్యుల కోసం ప్రవేశపెట్టిన పల్లె వెలుగులో జరుగుతున్న అడ్డగోలు దోపిడీని అరికట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు డిమాండ్ చేశారు.


All Rights Reserved By telugunewstimes
Print Save