
న్యూఢిల్లీ న్యూస్: భారత రైల్వే శాఖ కొత్త రైల్వే ఛార్జీలను ఇవాళ అర్ధరాత్రి నుంచిNationwide అమలు చేయనుంది. తాజా మార్పుల ప్రకారం, తత్కాల్ టికెట్ బుకింగ్కి ఆధార్ గుర్తింపు తప్పనిసరిగా ఉండే నిబంధనను కూడా కలిపి అమల్లోకి తీసుకొచ్చారు.
రైల్వే బోర్డు అన్ని జోన్ల జనరల్ మేనేజర్లకు ఇందుకు సంబంధించిన సర్క్యులర్ను జారీ చేసింది. ముఖ్యంగా సెకండ్ క్లాస్ ఆర్డినరీ టికెట్ల ధరలను 501 కిలోమీటర్ల నుంచి 1,500 కిలోమీటర్ల దూరానికి రూ.5 చొప్పున పెంచారు. అయితే, 500 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి టికెట్ ధరల్లో మార్పులేవీ ఉండవని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం ప్రయాణికులపై కొంత భారం మోపవచ్చన్న విమర్శలున్నప్పటికీ, రైల్వే శాఖ మాత్రం సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు ఇది అవసరమని చెబుతోంది. కొత్త ఛార్జీలు తక్షణమే అమలులోకి రానున్నాయి.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com