Logo
Date of Publish : 15 May 2026, 8:21 am
Editor : CH. MUKUNDARAO

ముఖ్యమంత్రి విజయ్ అధికారిక చిత్రపటం విడుదల.. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశాలు

చెన్నై న్యూస్ : ఈ నెల 10వ తేదీన శ్రీ ఎస్. జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజల సమక్షంలోనే ఆయన మూడు కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే పథకం, ‘సింగప్పెన్’ పేరుతో మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యదళం ఏర్పాటు, అలాగే మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక నిరోధక దళం ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించిన ఆదేశాలను ముఖ్యమంత్రి ఆమోదించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎస్. జోసెఫ్ విజయ్ అధికారిక చిత్రపటాన్ని తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ భవనాలలో ఈ చిత్రపటాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
........


All Rights Reserved By telugunewstimes
Print Save