
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ స్లాబులు అమల్లోకి వస్తున్నాయి. ఇకపై రెండు స్లాబులు మాత్రమే ఉంటాయి – 5% మరియు 18%.
దీంతో అనేక వస్తువులపై పన్నులు భారీగా తగ్గి, వాటి ధరలు కూడా తగ్గనున్నాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పరికరాలు, ఆరోగ్య, విద్య, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వినియోగదారులకు పెద్ద ఊరట లభించనుంది.
నిత్యావసర వస్తువులు
షాంపూ, టూత్పేస్ట్, సబ్బులు, షేవింగ్ క్రీమ్ : 18% → 5%
వెన్న, నెయ్యి, జున్ను, పాల ఉత్పత్తులు : 12% → 5%
ప్యాక్ చేసిన నమ్కీన్, భుజియా, మిక్చర్స్ : 12% → 5%
వంట పాత్రలు : 12% → 5%
పిల్లల ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్ : 12% → 5%
కుట్టు యంత్రాలు, భాగాలు : 12% → 5%
రైతులు – వ్యవసాయ రంగం
ట్రాక్టర్లు, టైర్లు, భాగాలు : 18%/12% → 5%
పురుగుమందులు, కలుపునాశకాలు : 12% → 5%
డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు : 12% → 5%
వ్యవసాయ, ఉద్యానవన యంత్రాలు : 12% → 5%
ఆరోగ్య రంగం
ఆరోగ్య, జీవిత బీమా : నిల్
థర్మామీటర్ : 18% → 5%
మెడికల్ ఆక్సిజన్ : 12% → 5%
డయాగ్నస్టిక్ కిట్లు, రీఏజెంట్లు : 12% → 5%
గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్ : 12% → 5%
లెన్సులు : 12% → 5%
విద్యా రంగం
మ్యాపులు, చార్టులు, గ్లోబులు : 12% → నిల్
పెన్సిళ్ళు, క్రేయాన్స్, షార్పనర్లు : 12% → నిల్
ఎక్సర్సైజ్ బుక్స్, నోట్బుక్స్ : 5% → నిల్
రబ్బర్లు : 5% → నిల్
ఆటోమొబైల్స్
హైబ్రిడ్ కార్లు (పెట్రోల్/డీజిల్) : 28% → 18%
3-చక్రాల వాహనాలు : 28% → 18%
మోటార్ సైకిళ్లు (350cc లోపు) : 28% → 18%
సరకు రవాణా వాహనాలు : 28% → 18%
ఎలక్ట్రానిక్స్ వస్తువులు
ఎయిర్ కండీషనర్లు : 28% → 18%
టెలివిజన్లు (32 అంగుళాల పైగా) : 28% → 18%
మానిటర్లు, ప్రొజెక్టర్లు : 28% → 18%
డిష్ వాషింగ్ యంత్రాలు : 28% → 18%
👉 మొత్తానికి, కొత్త జీఎస్టీ స్లాబులు వినియోగదారులకు ఊరటను ఇచ్చేలా మారాయి. నిత్యావసరాల నుంచి ఆటోమొబైల్స్ వరకు ధరలు తగ్గడం వల్ల సాధారణ ప్రజలకు పెద్ద లాభం కలగనుంది.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com