
విల్లివాకం న్యూస్: అన్నాఅరివాలయంలో శుక్రవారం ఉదయం ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గారిని కలిసి మాదిగల (అరుంధతీయుల)
అభివృద్ధి కొరకు వినతి పత్రం
సమర్పించినారు ఎస్ సి – ఎ కు 3% రిజర్వేషన్లు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు జిఓఎంఎస్
61/2009ను రద్దు చేయాలి, ఎస్ సి- ఏ అరుంధతీయుల రిజర్వేషన్లు 8%కు పెంచాలని, అరుంధతీయుల అభివృద్ధి కార్పోరేషన్ ఏర్పాటు
చేయాలని, ఎస్సి కమిషన్ లో
మాదిగలకు ప్రాతినీద్యం ఇవ్వాలని, రాజకీయ రిజర్వేషన్లలో అరుంధతీయులకు వార్డు
నెంబర్ ఎంపి, ఎంఎల్ఏ కు
50% ఇవ్వాలని, వీటితో పాటు
చెన్నైలో మన వారికి ఇళ్ళ పట్టాలు, కార్పోరేషన్ స్థలాలకు అనేవి, ప్రధాన తీర తిరువళ్ళూరు జిల్లాలో ప్రత్యేక శ్మశాన వాటికలు, ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం సమర్పించినారు.
సీఎం గారు సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామి ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఎం కొండయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుకుమార్, ప్రెసిడియం చైర్మ్నన్ సిహెచ్ ఎ దేవసహాయం, అధికార ప్రతినిధి కె. కుమార్, వి. విశ్వప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ ఈ. నాగభూషణం, ఎం. బాలాజీ, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె. భాస్కర్, జాయింట్ సెక్రటరీ: డి వై శ్రీనివాస్, చెన్నై నాయకులు, జి. గోపి, రాఘవులు, వై శ్రీరామ్, సుబ్రహ్మణ్యం, కోటేశ్వరరావు, ఇజ్రాయిల్, తిరువల్లూర్ జిల్లా నాయకులు వంశీ, వాసు, కుప్పన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
………
..