చెన్నై న్యూస్: గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల LPG (Liquefied Petroleum Gas) సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.60 పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, అలాగే అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సాధారణంగా చమురు సంస్థలు ప్రతి నెల మొదటి రోజున గ్యాస్ సిలిండర్ ధరలను సవరించుతాయి. అయితే ఈసారి అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి తీసుకువచ్చారు.
కొత్త ధరల ప్రకారం, రాజధాని న్యూఢిల్లీ లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.835 నుండి రూ.913కు పెరిగింది. అలాగే చెన్నై లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.928.50గా నిర్ణయించారు.
ఈ పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com