Logo
Date of Publish : 09 March 2026, 8:15 am
Editor : CH. MUKUNDARAO

ఎల్పీజీ బుకింగ్ నిబంధనలు మార్పు

టి నగర్ న్యూస్:వంట గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించాయి. గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని తగ్గించడం మరియు పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు ఒక సిలిండర్ తీసుకున్న 15 రోజుల తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. తాజా మార్పులతో ఆ గడువును 21 రోజులకు పెంచారు. అంటే ఒకసారి సిలిండర్ డెలివరీ అయిన తర్వాత తదుపరి బుకింగ్ చేయాలంటే కనీసం మూడు వారాలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా గ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్డేట్ చేశారు.
అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కనెక్షన్‌పై గరిష్టంగా 15 సిలిండర్లు మాత్రమే పొందేలా పరిమితి కొనసాగుతుంది. ఇందులో మొదటి 12 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. మిగిలిన మూడు సిలిండర్లు నాన్-సబ్సిడీ ధరపై కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అయితే డెలివరీ విషయంలో వినియోగదారులకు సౌలభ్యం కల్పిస్తూ, గ్యాస్ బుక్ చేసిన తర్వాత 24 గంటలలోపు సిలిండర్ అందేలా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీలకు సూచించారు. గ్యాస్ నిల్వల్లో ఎలాంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. కొత్త నిబంధనలు పారదర్శక పంపిణీ కోసం మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపారు.


All Rights Reserved By telugunewstimes
Print Save