Logo
Date of Publish : 10 September 2024, 3:42 pm
Editor : CH. MUKUNDARAO

అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రారంభోత్సవం

విల్లివాకం న్యూస్: జెఎన్‌ఎన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అటానమస్ కాలేజ్, చెన్నై 2024-2025 మొదటి విద్యా సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. హెక్సావేర్ టెక్నాలజీస్ కు చెందిన కవిమామణి అబ్దుల్ ఖాదర్ మరియు కృష్ణ బాల గురునాథన్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని 500 మందికి పైగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జెఎన్‌ఎన్‌ అకడమిక్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎస్‌.జయచంద్రన్‌, వైస్‌ ఛాన్సలర్‌ నవీన్‌ జయచంద్రన్‌, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ గణేశన్‌, ఇంజినీరింగ్‌ కళాశాలల అన్ని విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, ఫ్రెషర్లు పాల్గొన్నారు. వేడుకల ముగింపులో ప్రథమ సంవత్సరం విద్యార్థుల సమన్వయకర్త డా. షాలిని కృతజ్ఞతలు తెలిపారు.


All Rights Reserved By telugunewstimes
Print Save