Logo
Date of Publish : 01 July 2024, 8:49 pm
Editor : CH. MUKUNDARAO

గీసాల చారిటబుల్ సొసైటీ పేదలకు ఆర్థిక సహకారం

పిఠాపురం,  జూలై 01 : పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామానికి చెందిన  గీసాల చారిటబుల్ సొసైటీ, షిలోహు చర్చి మినిస్ట్రీస్ సంయుక్తంగా ఏ.ఎస్. కవిటి గ్రామం, జల్లూరు, సామర్లకోట గ్రామాలలో నివసిస్తున్న వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు 800 చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగిందని సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ ఆర్థిక సహకారం వారి జీవనానికి ఎంతో ఉపయోగపడుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు. ప్రతి నెల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయం అందించడమే తమ సొసైటీ ముఖ్య ఉద్దేశ్యం అని సొసైటీ సభ్యులు తెలియజేశారు. ఆర్థిక సహాయం పొందిన వారు గీసాల చారిటబుల్ సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గీసాల చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ గీసాల సత్యానందం, ట్రెజరర్ వాసంశెట్టి ఏడుకొండలు, సంస్థ వ్యవస్థాపకులు గీసాల శ్రీనివాస్, సెక్రటరీ దాకే సీయోను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


All Rights Reserved By telugunewstimes
Print Save