చెన్నై న్యూస్ :దేశవ్యాప్తంగా జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముఖ్యంగా అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నేరుగా పోటీకి దిగుతోంది. అలాగే తమిళనాడులో కూడా ఎన్డీఏ తరఫున గట్టి పోటీ ఇవ్వాలని వ్యూహాలు రచిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ నేతలను ప్రచారంలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు వేర్వేరు రాష్ట్రాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకు ఎదురు నిలవడానికి చంద్రబాబు ప్రచారం చేయవచ్చని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన సభల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
తమిళనాడులో పవన్ కళ్యాణ్ను ప్రచారంలోకి దించి, సనాతన ధర్మం అంశంతో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. అస్సాంలో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు నారా లోకేష్ను రంగంలోకి దించాలనే ఆలోచనలో ఉంది.
మొత్తానికి ఈ ఎన్నికల్లో ఏపీకి చెందిన ఈ ముగ్గురు నేతలు కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి