Logo
Date of Publish : 08 April 2025, 11:28 am
Editor : CH. MUKUNDARAO

సింగపూర్‌లో అగ్నిప్రమాదం: పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయాల పాలు… ఆస్పత్రిలో చికిత్స

టాలీవుడ్ పవర్ స్టార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అనుకోని ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్‌లోని తన స్కూల్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అతని చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. పొగ కారణంగా ఊపిరితిత్తులకు దెబ్బతగలడంతో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో మార్క్ శంకర్‌కు చికిత్స కొనసాగుతోంది.

పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నేవా కుమారుడితో కలిసి సింగపూర్‌లో ఉంటున్నారు. ఆమె అక్కడి నేషనల్ యూనివర్సిటీ నుంచి 2024లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశారు. తన విద్యార్హతల కోసం కుటుంబంతో అక్కడే నివసిస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్ సింగపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన అల్లూరి జిల్లాలో తన పర్యటన ముగించుకున్న తరువాత తక్షణమే సింగపూర్ వెళ్లనున్నట్లు సమాచారం.

మార్క్ శంకర్ పవనోవిచ్ పేరుపై ఆసక్తికరమైన విశేషాలు:
పవన్ కల్యాణ్ తన కుమారుడి పేరును ప్రత్యేకంగా, అర్థవంతంగా ఎన్నుకున్నారు. "మార్క్" అనే పేరు రోమన్ యోధ దేవుడు "మార్స్" నుండి వచ్చినది. "శంకర్" అనే పదం చిరంజీవి అసలు పేరు "శివ శంకర్ వర ప్రసాద్" నుండి తీసుకున్నది. "పవనోవిచ్" అంటే పవన్ కుమారుడు అనే అర్థం వచ్చేలా రష్యన్ శైలిలో రూపొందించారు. పవన్ కల్యాణ్ మూడవ భార్య అన్నా లెజ్నేవా రష్యాకు చెందినవారు మరియు క్రైస్తవ మతానికి చెందినవారు. పెళ్లి తర్వాత భారతీయ సంప్రదాయాలను she పూర్తిగాఅంగీకరించారు.


All Rights Reserved By telugunewstimes
Print Save