telugu news times https://telugunewstimes.com తెలుగు న్యూస్ టైమ్స్ Sun, 01 Mar 2026 17:58:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://telugunewstimes.com/wp-content/uploads/2024/08/cropped-tnt-1-32x32.jpg telugu news times https://telugunewstimes.com 32 32 సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ https://telugunewstimes.com/indias-big-win-in-super-8s-entry-into-the-semis/ https://telugunewstimes.com/indias-big-win-in-super-8s-entry-into-the-semis/#respond Sun, 01 Mar 2026 17:57:32 +0000 https://telugunewstimes.com/?p=5565 ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భారత జట్టు మరో అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వెస్టిండీస్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ 40 పరుగులు చేయగా, జాసన్ హోల్డర్ (37 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (34 నాటౌట్), షై హోప్ 32, షిమ్రాన్ హెట్మయెర్ 27 పరుగులతో జట్టుకు మంచి స్కోరు అందించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీసుకోగా, హార్దిక్ పాండ్యా మరియు వరుణ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 97 పరుగులతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. సూర్యకుమార్ యాదవ్ (18), తిలక్ వర్మ (27), హార్దిక్ పాండ్యా (17) కీలక పరుగులు జోడించారు.
ఈ విజయంతో భారత్ సూపర్-8లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సెమీస్‌లోకి అడుగుపెట్టగా, వెస్టిండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
……..

]]>
https://telugunewstimes.com/indias-big-win-in-super-8s-entry-into-the-semis/feed/ 0
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల https://telugunewstimes.com/tamil-nadu-final-voter-list-released/ https://telugunewstimes.com/tamil-nadu-final-voter-list-released/#respond Mon, 23 Feb 2026 12:57:58 +0000 https://telugunewstimes.com/?p=5561 చెన్నై: తమిళనాడులో భారత ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) ప్రక్రియ పూర్తికాగా, తుది ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ వివరాల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.67 కోట్లకు చేరింది.
తాజా గణాంకాల ప్రకారం 2,77,38,925 మంది పురుషులు, 2,89,60,838 మంది మహిళలు, 7,617 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 74 లక్షలకు పైగా ఓటర్లు జాబితా నుంచి తొలగించబడినట్లు అధికారులు తెలిపారు. గతంలో 6.41 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం తగ్గి 5.67 కోట్లకు చేరింది.
2025 నవంబర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం 2025 డిసెంబర్ 19న విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాలో సుమారు 5.43 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను 2026 జనవరి 30 వరకు స్వీకరించి పరిశీలించిన అనంతరం 27,53,796 మంది కొత్త ఓటర్లను తుది జాబితాలో చేర్చారు.
సవరణలో భాగంగా 97 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. వీరిలో సుమారు 26.94 లక్షల మంది మరణించినవారు కాగా, 66.44 లక్షల మంది ఇతర ప్రాంతాలకు మారినవారిగా గుర్తించారు. మరో 3.39 లక్షల మంది బహుళ ప్రాంతాల్లో నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
తుది జాబితా ప్రకారం చెంగల్పట్టు జిల్లాలోని షోలింగనల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 5,36,991 మంది ఓటర్లు నమోదయ్యారు. ఇక చెన్నైలోని హార్బర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 1,16,896 మంది ఓటర్లు ఉన్నారు.
రాబోయే 2026 వేసవి కాలంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా ఓటర్ల జాబితా కీలకంగా మారింది.
తుది గణాంకాలు:
మొత్తం ఓటర్లు: 5.67 కోట్లు
పురుషులు: 2.77 కోట్లు
మహిళలు: 2.89 కోట్లు
థర్డ్ జెండర్ ఓటర్లు: 7,617 మంది
………….

]]>
https://telugunewstimes.com/tamil-nadu-final-voter-list-released/feed/ 0
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి https://telugunewstimes.com/treating-diseases-with-ragas-if-we-preserve-the-telugu-language-our-culture-will-survive-padma-bhushan-dr-varaprasad-reddy/ https://telugunewstimes.com/treating-diseases-with-ragas-if-we-preserve-the-telugu-language-our-culture-will-survive-padma-bhushan-dr-varaprasad-reddy/#respond Sun, 22 Feb 2026 15:53:31 +0000 https://telugunewstimes.com/?p=5554 చెన్నై న్యూస్:రోగాలకు చికిత్స రాగాల ద్వారానే సాధ్యమవుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ సంగీతాన్ని ఆస్వాదించాలని పద్మభూషణ్ డాక్టర్ కె. ఐ. వరప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. వేద విజ్ఞాన వేదిక (తరతరాల తెలుగు కవిత) 16వ వార్షికోత్సవ మహోత్సవం ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఆస్కా ప్రాంగణంలోని గోదావరి హాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు.
ఈ సభకు వేదిక అధ్యక్షులు జేకే రెడ్డి అధ్యక్షత వహించగా, శ్రీమతి అరుణ శ్రీనాథ్ ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖ సినీనటి ఊర్వశి శారద, ప్రభ రమేష్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. వేదిక కార్యదర్శి కందనూరి మధు అతిథులను ఆహ్వానిస్తూ స్వాగత ఉపన్యాసం చేశారు.
ముఖ్య అతిథిగా శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కె. ఐ. వరప్రసాద్ రెడ్డి, విశిష్ట అతిథిగా కళారత్న ప్రభ రమేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా–సాహిత్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. తెలుగు కార్యక్రమాలకు పెద్దవాళ్లు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలను తీసుకురావడం ద్వారా యువతలో భాషపై మమకారం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సాహిత్యం, భాష, సంగీతం అనేవి కేవలం డిగ్రీల కోసం కాకుండా మన సంస్కృతి విలువలను తెలుసుకునే మార్గదర్శకాలని తెలిపారు.
ఆరోగ్యానికి సంగీతం ఎంతో అవసరమని, రోగాలకు రాగాలు కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయని చెప్పారు. భారత, రామాయణ, భాగవతాలలో ఉన్న జీవన విలువలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని సూచించారు. “మనమే తెలుగు భాషను కాపాడటం కాదు… తెలుగు భాషే మనల్ని కాపాడుతుంది” అని పేర్కొన్నారు.
విశిష్ట అతిథి కళారత్న ప్రభ రమేష్ మాట్లాడుతూ తాను ఇటీవల సితార్‌లో అక్షరాలు నేర్చుకుంటున్నానని, వేద విజ్ఞాన వేదిక ద్వారా ‘సితార్ నీరాజనం’ అందించడం ఆనందంగా ఉందన్నారు. గత పదహారేళ్లుగా ప్రాచీన మరియు ఆధునిక సాహిత్యాన్ని క్రమశిక్షణతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.

వేదిక అధ్యక్షుడు జేకే రెడ్డి మాట్లాడుతూ చెన్నై మహానగరంలోని నలుమూలల నుంచి తెలుగు సాహితీ ప్రియులు పదహారేళ్లుగా కార్యక్రమాలకు హాజరవుతూ సంస్థను ముందుకు నడిపిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. యువతరానికి తెలుగు భాష మాధుర్యాన్ని పరిచయం చేయడానికి మరింత కృషి చేస్తామని చెప్పారు.
కార్యదర్శి కందనూరి మధు మాట్లాడుతూ తెలుగు భాష మాధుర్యాన్ని నేటి తరానికి చేరవేస్తూ 16 సంవత్సరాలుగా క్రమశిక్షణ, సమయపాలనతో కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం శ్రీమతి ప్రభ రమేష్ ‘సితార్ నీరాజనం’, కుమారి భవ్య తూములూరు ‘సంగీత నీరాజనం’ సభికులను అలరించి ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖులు, భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

…………..

]]>
https://telugunewstimes.com/treating-diseases-with-ragas-if-we-preserve-the-telugu-language-our-culture-will-survive-padma-bhushan-dr-varaprasad-reddy/feed/ 0
‘జనని’ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం https://telugunewstimes.com/international-mother-language-day-celebrated-under-the-auspices-of-janani/ https://telugunewstimes.com/international-mother-language-day-celebrated-under-the-auspices-of-janani/#respond Sat, 21 Feb 2026 13:27:17 +0000 https://telugunewstimes.com/?p=5549 విళ్లివాకం న్యూస్: జనని (సాంఘిక సాంస్కృతిక సమితి), చెన్నై ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం ఘనంగా జరిగింది. చెన్నై, మైలాపూర్ లోని అమరజీవి స్మారక మందిరం దీనికి వేదికయింది. కార్యక్రమంలో ముందుగా రచయిత్రి అరుణ శ్రీనాథ్ స్వాగతోపన్యాసం చేశారు. ప్రార్ధనా గీతాన్ని నెల్లుట్ల లీల ఆలపించారు. జనని అధ్యక్షులు డాక్టర్ నిర్మలా పళనివేలు సభకు అధ్యక్షత వహించారు. వక్తలుగా చెన్నై రాజధాని కళాశాల, తెలుగు శాఖాధ్యక్షులు, డాక్టర్ ఎన్ ఎలిజబెత్ జయకుమారి, రచయిత్రులు తిరుమల ఆముక్త మాల్యద, క్రొవ్విడి రమాదేవి విచ్చేశారు. ముందుగా నిర్మలా పళనివేలు మాట్లాడుతూ యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని మాతృభాష దినోత్సవంగా ఏర్పాటు చేయడం గర్వకారణమని, అలాగే గిడుగు రామమూర్తి జయంతిని కలిపి పండుగలుగా జరుపుకుంటున్నామని అన్నారు. మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని తెలిపారు.

ఎలిజబెత్ జయకుమారి మాట్లాడుతూ తుమ్మల సీతారామమూర్తి చౌదరి రాసిన ‘రాష్ట్రగానం’ లో ఆంధ్రుడనై జన్మించితిని అనే రచన గురించి ప్రస్తావించారు. అలాగే మన పూర్వ కవులు తెలుగు భాష ఔన్నత్యాన్ని కొనియాడినట్లు పేర్కొన్నారు. అముక్త మాల్యద మాట్లాడుతూ అమ్మంటే ఎలా ఉంటుందో అమ్మ భాష అలా ఉంటుందని తెలిపారు. ఏ భాష వచ్చినా ఆ భాషలో నైపుణ్యం సాధిస్తే రాణించవచ్చని తెలిపారు. ప్రాథమిక భాష తెలుగు అయితే ఇతర భాషలను సులబంగా నేర్చుకోవచ్చని తెలుసుకోవచ్చని తెలిపారు. రచయిత్రి క్రొవ్విడి రమాదేవి మాట్లాడుతూ అమృతం కన్న, అమ్మ పాల కన్న, అన్య భాషల కన్న తెలుగు భాష అమృతమైనదని తెలిపారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ తెలుగు భాష తియ్యనైనదని, మధురమైన తెలుగు భాషను మరువకూడదని తెలిపారు. ఆర్.ఎస్.శర్మ రాసిన తెలుగు భాషపై సందేశాన్ని చదివి వినిపించారు. అలాగే, వంజరపు శివయ్య మాట్లాడుతూ తెలుగు భాషా ప్రాముఖ్యత తగ్గుతోంది గాని, తెలుగు భాష చచ్చిపోలేదని తెలిపారు. తెలుగులో విద్య నభ్యసించి ఇతర దేశాల్లో రాణిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. శిరీష మాట్లాడుతూ ఇంట్లో తెలుగు మాట్లాడితే తెలుగు భాష అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఆచార్య విస్తాలి శంకరరావు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ తెలుగు భాషపై రాసిన ‘బహుజన్మ కృతపేన్య పరిపాకమున జేసి’ అనే పద్యాన్ని రాగయుక్తంగా వినిపించారు. వ్యాఖ్యాతగా అరుణా శ్రీనాథ్ వ్యవహరించారు.
వందన సమర్పణ నాగమణి చేశారు. ఇందులో ఎల్ బి శంకరరావు దంపతులు, క్రొవ్విడి హరినాథ్, నెల్లుట్ల శ్రీనివాస్, శ్యామల, లయన్ రేవతి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

………

]]>
https://telugunewstimes.com/international-mother-language-day-celebrated-under-the-auspices-of-janani/feed/ 0
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం https://telugunewstimes.com/16th-anniversary-of-veda-vigyan-vedika-celebrated-in-chennai-invitation-to-telugu-people/ https://telugunewstimes.com/16th-anniversary-of-veda-vigyan-vedika-celebrated-in-chennai-invitation-to-telugu-people/#respond Sat, 21 Feb 2026 02:09:56 +0000 https://telugunewstimes.com/?p=5545 చెన్నై న్యూస్: చెన్నై మహానగరంలో తెలుగు భాష అభ్యున్నతికి, తెలుగు సాహిత్య వికాసానికి విశేషంగా కృషి చేస్తున్న వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలకు తెలుగు ప్రజలకు ఘన స్వాగతం పలుకుతోంది. చెన్నై విజయరాఘవ రోడ్డులోని ఆస్కా (ఆంధ్ర క్లబ్)లో శుక్రవారం ఉదయం వేదిక అధ్యక్షుడు జె.కె. రెడ్డి, కార్యదర్శి కందనూరు మధు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వేదిక కార్యదర్శి కందనూరు మధు మాట్లాడుతూ — మా శ్రమ, క్రమశిక్షణతో పాటు మిత్రుల సహకారమే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని, అందుకు అందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటామని తెలిపారు.
2010 ఫిబ్రవరిలో సంస్థ కార్యక్రమాలను ప్రారంభించామని, ఆదికవి నన్నయ సాహిత్యంపై స్థానిక పండితుల సమక్షంలో ఆచార్య దేవర్ల చిన్నికృష్ణయ్య గారి ప్రసంగంతో ఈ సాహిత్య యాత్రకు శ్రీకారం చుట్టడం విశేషమని పేర్కొన్నారు. మిత్రుల ప్రోత్సాహం, సీనియర్ సభ్యుడు జె.కె. రెడ్డి గారి మార్గదర్శకత్వంతో గత 16 సంవత్సరాలుగా ప్రతి నెల చివరి ఆదివారం క్రమం తప్పకుండా, సమయపాలనతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు వివిధ అంశాలపై ఉపన్యాసాలు నిర్వహిస్తూ, తెలుగేతర రాష్ట్రం అయిన తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో మాతృభాషపై గౌరవం, మమకారం పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలనే సంకల్పంతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు.
ఉపన్యాసాలతో పాటు అనేక పుస్తక ఆవిష్కరణ సభలను నిర్వహించామని, “వేద విజ్ఞాన వేదిక” ఆధ్వర్యంలో కొన్ని గ్రంథాలను ప్రచురించి ఉచితంగా పాఠకులకు పంపిణీ చేశామని చెప్పారు. రచయితలను సన్మానిస్తూ సాహిత్య సేవను కొనసాగిస్తున్నామని వివరించారు.
చెన్నైలో తెలుగు భాష కోసం కృషి చేస్తున్న ఇతర సంస్థలను గుర్తించి, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ వారికి సహాయం అందించామని తెలిపారు. ప్రతి సంవత్సరం కొందరికి రూ.25,000, మరికొందరికి రూ.10,000 చొప్పున సుమారు 10 మంది ప్రముఖులకు ఆర్థిక సహకారం అందించామని చెప్పారు.
ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని కేవలం సాహిత్య సభగా కాకుండా కూచిపూడి నృత్యం, శాస్త్రీయ సంగీత కచేరి లేదా తెలుగు నాటకం వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించడం తమ ఆనవాయితీ అని తెలిపారు.
మధ్యలో ఆంధ్ర సోషల్ అసోసియేషన్ భాగస్వాములుగా కలిసి కార్యక్రమాలు నిర్వహించారని, నిర్వహణ మార్పుల కారణంగా వారు విరమించుకున్నప్పటికీ వారి నిర్ణయాన్ని గౌరవించామని చెప్పారు. 2022 నుంచి సభాగృహం, భోజనాలు, అల్పాహారం తదితర ఏర్పాట్లన్నీ స్వయంగా నిర్వహిస్తున్నామని వివరించారు.
గతంలో మద్రాస్ నగరంలోని ప్రముఖ తెలుగు, సంస్కృత పండితులతో పాటు తిరుపతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి పలువురు మహానుభావులను ఆహ్వానించి ఉపన్యాసాలు నిర్వహించినట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన ప్రాచార్య శిలాకా రఘునాథ శర్మ గారు, ఆచార్య రామబ్రహ్మం గారు తదితర ప్రముఖులు సభలను అలంకరించారని పేర్కొన్నారు.
అధ్యక్షుడు జె.కె. రెడ్డి మాట్లాడుతూ — చెన్నై వంటి తెలుగేతర మహానగరంలో గత 16 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యం, మాతృభాష ఔన్నత్యాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు, యువతకు చేరవేస్తున్నామని తెలిపారు. కార్యదర్శి కందనూరు మధుతో సమన్వయంతో, క్రమశిక్షణతో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దేశవ్యాప్తంగా వేదికకు గుర్తింపు లభించిందని అన్నారు.
ఈ ఏడాది వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆస్కా ప్రాంగణంలోని గోదావరి హాల్లో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా శాంత బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. విశిష్ట అతిథిగా కళారత్న ప్రభా రమేష్ సితార్ వాద్య కార్యక్రమం అందించనుండగా, సంగీత నీరాజనం కుమారి భవ్య తూములూరు సంగీత కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు.
చెన్నై మహానగరంలోని తెలుగు సాహితీ ప్రియులు, తెలుగు సంఘాల నిర్వాహకులు, ప్రజలందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానించారు.
……..

]]>
https://telugunewstimes.com/16th-anniversary-of-veda-vigyan-vedika-celebrated-in-chennai-invitation-to-telugu-people/feed/ 0
ఘనంగా ఆద్య వినయ్ భారతనాట్యం అరంగేట్రం https://telugunewstimes.com/aadya-vinays-bharatanatyam-debut-in-grand-style/ https://telugunewstimes.com/aadya-vinays-bharatanatyam-debut-in-grand-style/#respond Sun, 15 Feb 2026 08:22:12 +0000 https://telugunewstimes.com/?p=5536 చెన్నై న్యూస్:మన తెలుగింటి అమ్మాయి, చెన్నై చేట్
పేట్‌లో నివసిస్తున్న ఆశ–వినయ్ దంపతుల ముద్దుల పుత్రిక కుమారి ఆద్య వినయ్ భారతీయ నాట్య ప్రవేశ (అరంగేట్రం) కార్యక్రమం ఆదివారం ఉదయం మైలాపూర్ లోని ఆర్ ఆర్ మహాసభలో ఎంతో ఘనంగా జరిగింది. పాటలకు అనుగుణంగా హావభావాలతో చేసిన ఆమె నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులందరి మన్ననలు పొందాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలైమామణి కె.ఎన్. రామస్వామి, భారతీయ విద్యాభవన్ చెన్నై డైరెక్టర్, గురువు శ్రీమతి శృతి శోభ హాజరయ్యారు. తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్, కుమారి ఆద్య వినయ్‌ను శాలువాతో సత్కరించి “నాట్య మయూరి” అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, నాట్యం ఒక గొప్ప కళ అని, రాజుల కాలంలో గ్రామ ప్రజల సమస్యలను నాట్య రూపంలో రాజులకు తెలియజేసే సంప్రదాయం ఉండేదని తెలిపారు. ఆ కాలంలో టెక్నాలజీ లేకపోవడంతో నాట్యకళ ప్రజలకు ఎంతో ఉపయోగపడేదన్నారు. రామాయణం, మహాభారతం, శివతాండవం వంటి ఇతిహాసాలను నాట్య రూపంలో చూపిస్తూ భావితరాలను భక్తి మార్గంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

మన తెలుగింటి ఆణిముత్యాలను వెలుగులోకి తీసుకురావడం తమ ధ్యేయమని, కుమారి ఆద్య వినయ్ వెంపటి చినసత్యం వంటి మహానుభావుల స్థాయికి ఎదిగి పేరు ప్రఖ్యాతలు పొందాలని, చెన్నైకే పరిమితం కాకుండా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ నాట్యకళకు మరింత గౌరవం తీసుకురావాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్ట్ కళాకారులు పద్మశ్రీ తోట ధరణి, తోట భానూజి దంపతులు, రూపవతి దంపతులు,బంధుమిత్రులు ,కుటుంబ సభ్యులు, తెలుగు ప్రజలు పాల్గొన్నారు.

 

………

]]>
https://telugunewstimes.com/aadya-vinays-bharatanatyam-debut-in-grand-style/feed/ 0
క్రీడలతో శారీరక–మానసిక దృఢత్వం: కె. అనిల్ కుమార్ రెడ్డి https://telugunewstimes.com/physical-and-mental-fitness-through-sports-k-anil-kumar-reddy/ https://telugunewstimes.com/physical-and-mental-fitness-through-sports-k-anil-kumar-reddy/#respond Fri, 13 Feb 2026 06:54:35 +0000 https://telugunewstimes.com/?p=5526 చెన్నై న్యూస్: క్రీడల ద్వారా విద్యార్థుల్లో సంపూర్ణ ఆరోగ్యం, శారీరక మరియు మానసిక దృఢత్వం పెంపొందించుకోవచ్చని శ్రీ వేణుగోపాల విద్యాలయం ప్రెసిడెంట్ కె. అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. చెన్నై మాండవేలిలోని శ్రీ వేణుగోపాల విద్యాలయం 45వ వార్షిక క్రీడా సమారోహం శుక్రవారం ఉదయం చెన్నై ఎగ్మోర్‌లోని రాజారత్నం స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ కె. అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా 91వ చెస్ గ్రాండ్‌మాస్టర్ వి.ఎస్. రాహుల్ పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన మార్చ్ పాస్ట్ అనంతరం ముఖ్య అతిథి రాహుల్ మరియు నిర్వాహకులు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాహుల్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, శాంతి పావురాలను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కె. అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే శారీరక–మానసిక దృఢత్వం పెంపొందడంతో పాటు ఉన్నత స్థాయిలకు చేరుకోవచ్చని తెలిపారు. పలు సూచనలు అందజేశారు. ముఖ్య అతిథి వి.ఎస్. రాహుల్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, సమాజంలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయని చెప్పారు.

విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగా, కర్రసాము సాధన, నృత్యాలు ఆకట్టుకున్నాయి.

విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రెసిడెంట్ కె. ఆనంద్ కుమార్, సెక్రటరీ మరియు కరస్పాండెంట్ వి. గోవింద్, ట్రెజరర్ కె. రంగారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆర్. ఇలాంగో, హెడ్‌మిస్ట్రెస్ వి. శీలా తదితరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

………

]]>
https://telugunewstimes.com/physical-and-mental-fitness-through-sports-k-anil-kumar-reddy/feed/ 0
భారత్ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ https://telugunewstimes.com/india-is-the-fourth-largest-economy/ https://telugunewstimes.com/india-is-the-fourth-largest-economy/#respond Thu, 12 Feb 2026 09:24:09 +0000 https://telugunewstimes.com/?p=5522 చెన్నై న్యూస్ :ది హిందూ గ్రూప్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటీ) మరియు సిఫీ టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన ‘ది హిందూ టెక్ సమ్మిట్ 2026’ ప్రారంభ సమావేశంలో డాక్టర్ విశ్వనాథన్ ప్రసంగించారు. గత రెండు దశాబ్దాల్లో భారత్ విశేష ఆర్థిక పురోగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2025 సంవత్సరంలో జపాన్‌ను అధిగమించినట్లు తెలిపారు. దేశం సాంకేతిక రంగం, పరిశ్రమలు మరియు ఆవిష్కరణల ద్వారా గ్లోబల్ స్థాయిలో తన స్థానం బలపరుచుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.

]]>
https://telugunewstimes.com/india-is-the-fourth-largest-economy/feed/ 0
ఘంటసాల కు ఘన నివాళి https://telugunewstimes.com/a-grand-tribute-to-the-bell-tower/ https://telugunewstimes.com/a-grand-tribute-to-the-bell-tower/#respond Wed, 11 Feb 2026 10:39:37 +0000 https://telugunewstimes.com/?p=5518 తెలుగుజాతి గర్వించదగ్గ అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతిని బుధవారం ఉదయం పెరంబూరులో ఘనంగా నిర్వహించారు. చెన్నై పెరంబూరులోని తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఘంటసాల చిత్రపటానికి జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, గాయకుడు కిడాంబి లక్ష్మి కాంత్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తమ్మినేని బాబు మాట్లాడుతూ, తెలుగుజాతి గర్వించదగ్గ మహాగాయకుడు ఘంటసాల అని, సంగీతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
లక్ష్మి కాంత్ మాట్లాడుతూ, తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం, జనని సంస్థలు ప్రతి ఏడాది ఘంటసాల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఘంటసాల పై తనకు ఎంతో అభిమానం ఉందని, తెలుగువారిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు.ఘంటసాల పాడిన భగవద్గీత పద్యాలు పాడి వినిపించారు.
జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ, ఘంటసాల ఎన్నో ఆధ్యాత్మిక, సాంఘిక, పౌరాణిక, విషాద గీతాలను మధురంగా ఆలపించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయనను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం. కొండయ్య, వి. సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
………

]]>
https://telugunewstimes.com/a-grand-tribute-to-the-bell-tower/feed/ 0
“ఘంటసాల జీవన జీవం గానం” https://telugunewstimes.com/the-life-of-the-bells-is-the-life-of-the-singing/ https://telugunewstimes.com/the-life-of-the-bells-is-the-life-of-the-singing/#respond Wed, 11 Feb 2026 01:31:59 +0000 https://telugunewstimes.com/?p=5514 ఘంటసాల అంతగా అనుభవం లేని రోజుల్లో చేసిన సంగీత కచేరి విఫలమైంది. ఆ విఫలమే సంగీత
సరస్వతికి ఓ గాన గంధర్వుణ్ణి అందించినది.
ఆనాడు అవహేళన చేసినవారికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు. పట్టుదలతో విజయనగరంలోని
సంగీత కళాశాలలో సంగీత విద్వాంసులు ద్వారం వెంకటస్వామినాయుడు, ఆదిభట్ల నారాయణదాసు గార్ల
వద్ద శిష్యరికం చేశాడు. ఆయన ఆ పట్టుదలే ఒక్క ఆంధ్రదేశానికే కాదు, సంగీత ప్రపంచానికే ఓ
అమరగాయకుణ్ణి అందించినది.
ఆయన ప్రజ్ఞాప్రాభవాన్ని గుర్తించిన గురుతుగా ఆయన గురువు వెంకటస్వామినాయుడుగారిచ్చిన
వీణ యిప్పటికీ ఆయన ఇంటిలో భద్రంగా వుండడం ఆయన గురుభక్తికి నిదర్శనం.సంగీత కచేరీలు చేద్దామని చెన్నైకి వచ్చిన ఘంటసాల చలనచిత్ర గాయకుడిగా రూపాంతరం చెందడంతెలుగు చలనచిత్ర పరిశ్రమ అదృష్టమనే చెప్పాలి.1922 వ సంవత్సరము డిసెంబరు 4 న గుడివాడ చౌటపల్లి గ్రామవాస్తవ్యులు సూర్యనారాయణ రత్తమ్మ దంపతులకు జన్మించిన ఘంటసాల వెంకటేశ్వరరావు తన సంగీత జీవనయాత్రలో ఎన్నో బహుమతులు
మరెన్నో ప్రజా సంఘాల పురస్కారాలు అన్నింటినీ మించి కోట్లాది ప్రజల అభిమానం ఆయన చెంతకు
చేరాయి.మానవతా విలువలు మంటకలిసిపోతున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాలు ఈనాడు మచ్చుకైనా
కానరావడం లేదు. దిశానిర్దేశం లేక ప్రజకు ముఖ్యంగా యువతం పెడత్రోవ పడుతుందనే ప్రగతిశీలుర
ఆవేదన తీరాలంటే ఘంటసాల గానామృతాన్ని పంచాలి.
” జగదభిరాముడు శ్రీరాముడే”, “ అహెూ లీలామానుష వేషధారి! మురారీ!”, ” నను పాలింపగ నడచి
వచ్చితివా గోపాలా” అంటూ దేవదేవుని కీర్తించే ఆ పాటలు మధుర గాయకుడు ఘంటసాల గారి నోటి
ద్వారా వింటుంటే మనము భక్తి సాగరములో మునుగుతాము, తద్వారా మధురానుభూతిని పొందుతాము. ” కలిమి కన్నా చెలిమి మిన్న కలవు మణులెన్నో నీలోన”, “ మనసంత నీకు మందిరముగా మమతలేపూవులుగా, కానుకగా అర్పించి నీకై కలకాలం జీవించనా” అంటూ ప్రియురాలికి తనను అర్పించుకొనే
పాటైన, ” నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా” అంటూ అతివ అందాన్ని వర్ణించే
పాటైనా, ” ఎక్కడవున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుకున్న నిను వీడి అందుకే వెళ్ళు
తున్నా” అనే భగ్న ప్రేమికుని హృదయ స్పందనను తెలిపే పాటైనా, “ ఊహలు గుసగుసలాడే మన హృదయము
ఊయ్యలలుగే” అంటూ “ ప్రేయసీ ప్రియుల గుసగుసలు తెలిపే పాటైనా,“ ఒకనాటి ఉద్యానవనము నేడు
కనము … అదియే మరు భూమిగా నీవు మార్చేవులే ” అంటూ విధి వ్రాతకు గురైన ఓ అభాగ్యుని వ్యధ తెలిపే

పాటైనా, “ ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరు సుఖపడాలి నందనందనా” అంటూ భవిష్యత్తుపై
ఆశను చిగుర్చే పాటైనా, “ అందరికోసం ఒక్కడు నిలిచి ఒక్కడి కోసం అందరు కలసి” అంటూ సమతా
మమతల సంస్కృతిని తెలిపే ప్రబోధ గీతమైనా ఘంటసాల పాడితేనే, ఆనందం అందులోనే లో వుంది
అర్థం, పరమార్థం.పాడే ఆ ఒక్కొక్క పాట ఆయన పాడుతూ ఉంటే అందు ఒక్కొక్క పలుకు ఓ అమృత ధారయై చివరికిఅమృతవాహినిగా ప్రవహిస్తుంది. పాటలోని ఉచ్ఛారణ, తెలిపే భావం, పలికే భాష, ఆయనకే అది సాధ్యం.మరెవరికీ సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదేమో! అలా మధురమైన తన కంఠంతో పాటలను పాడి, అటుసంగీతానికి ఇటు మధురమైన మన మాతృభాషకు కీర్తిప్రతిష్టలు ఆర్జించి పెట్టిన ఆ మధుర గాయకుడుమనల నుండి విడిపోరు, మన మదిలో ఎప్పుడూ చిరస్థాయిగా వుంటారు.
పాట వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచేది. ఆయన పాటలు ఆపాతమధురం. దేశభక్తిపూరితమై,
ప్రేమానురాగాలు పంచే సఖ్యతా సౌభ్రాతృత్వాన్ని తెలియచేసే ఆయన పాటలను విరివిగా ప్రచారం చేయాలి.పాశ్చాత్య సంగీతానికి బానిసలై పరవళ్లు తొక్కుతున్న యువతరంలో మార్పు తేవాలి. అందుకు సాంస్కృతికసంఘాలు ముందుకు రావాలి.
పాడుతూనే చనిపోవాలనేవారు ఘంటసాల., అలా సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుగా
వెలిగిన ఘంటసాల ఆ సంగీత సేవలో తరిస్తూనే 1974 ఫిబ్రవరి 11 న తనువు చాలించారు. అయినా
సంగీతం ఓ ప్రవాహం. అది ప్రవహిస్తూనే వుంటుంది. అలాగే ఘంటసాల పాటలు జనహృదయాల్లో
నిలిచిపోయాయి. అవి విడిపోవు.
‘ పాటకు పల్లవి ప్రాణం నా జీవన జీవం గానం’-అవును. అందుకే ఘంటసాల మరణించలేదు. సంగీతం వున్నంత కాలంఆయన జీవించే వుంటారు.
-గుడిమెట్ల చెన్నయ్య, చెన్నై ,సంచారవాణి 9790783377.

(అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 52వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

]]>
https://telugunewstimes.com/the-life-of-the-bells-is-the-life-of-the-singing/feed/ 0