telugu news times https://telugunewstimes.com తెలుగు న్యూస్ టైమ్స్ Thu, 12 Jun 2025 09:54:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://telugunewstimes.com/wp-content/uploads/2024/08/cropped-tnt-1-32x32.jpg telugu news times https://telugunewstimes.com 32 32 గుజరాత్‌లో విమాన ప్రమాదం – ప్రయాణికుల పరిస్థితి అనిశ్చితం https://telugunewstimes.com/plane-crash-in-gujarat-passengers/ https://telugunewstimes.com/plane-crash-in-gujarat-passengers/#respond Thu, 12 Jun 2025 09:54:17 +0000 https://telugunewstimes.com/?p=4529 చెన్నై న్యూస్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఈరోజు మధ్యాహ్నం 1.17 గంటలకు లండన్‌కు బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఈ ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని నివాస ప్రాంతంలో జరిగింది.

విమానంలో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత విమానం మంటల్లో చిక్కుకొని చుట్టుపక్కల ప్రాంతమంతా నల్లటి పొగతో కమ్ముకున్నది. అగ్నిమాపక, పోలీసు బృందాలు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. స్థానికులూ సహాయ చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదే విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ, ఇతర ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. వారి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు.

]]>
https://telugunewstimes.com/plane-crash-in-gujarat-passengers/feed/ 0
పినాకినీ ఎక్స్‌ప్రెస్ టైమ్‌టేబుల్‌ మార్పులు: కొన్ని తేదీల్లో 20 నిమిషాల ఆలస్యం https://telugunewstimes.com/pinakini-express-timetable-changes-20-minute-delay-on-some-dates/ https://telugunewstimes.com/pinakini-express-timetable-changes-20-minute-delay-on-some-dates/#respond Wed, 11 Jun 2025 14:20:16 +0000 https://telugunewstimes.com/?p=4526 చెన్నై: చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ దాకా నడుస్తున్న పినాకినీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దక్షిణ రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పొన్నేరి–కవరాయ్‌పేట్టై స్టేషన్ల మధ్య జరిగే ఇంజినీరింగ్ పనుల కారణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ మార్పులు జూన్‌ 12, 16, 19, 23, 26, 30 తేదీల్లో అమలులోకి రానున్నాయి. సాధారణంగా మధ్యాహ్నం 2:05కి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే 12712 పినాకినీ ఎక్స్‌ప్రెస్, పై తేదీలలో 20 నిమిషాల ఆలస్యం అయిన 2:25కు ప్రయాణం ప్రారంభించనుంది. దీంతో విజయవాడ చేరే సమయం కూడా తగినంత ఆలస్యం కానుంది.

ఈ మార్పుల ప్రభావం సూర్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి జంక్షన్‌లకు వర్తించనుంది. ఈ స్టేషన్లలోనూ రైలు 20 నిమిషాల ఆలస్యంగా చేరే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

దక్షిణ రైల్వే తాత్కాలిక ఇంజినీరింగ్ పనులు పూర్తయ్యే వరకూ ఈ మార్పులు కొనసాగనున్నాయి. ప్రయాణికులు సంబంధిత తేదీల్లో తమ ప్రయాణానికి ముందుగానే సరిచూసుకుని ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

]]>
https://telugunewstimes.com/pinakini-express-timetable-changes-20-minute-delay-on-some-dates/feed/ 0
ముఖ్యమంత్రితో ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ భేటి https://telugunewstimes.com/mrps-state-working-committee-meets-with-chief-minister/ https://telugunewstimes.com/mrps-state-working-committee-meets-with-chief-minister/#respond Sun, 08 Jun 2025 00:03:03 +0000 https://telugunewstimes.com/?p=4520 విల్లివాకం న్యూస్: అన్నాఅరివాలయంలో శుక్రవారం ఉదయం ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గారిని కలిసి మాదిగల (అరుంధతీయుల)
అభివృద్ధి కొరకు వినతి పత్రం
సమర్పించినారు ఎస్ సి – ఎ కు 3% రిజర్వేషన్లు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు జిఓఎంఎస్
61/2009ను రద్దు చేయాలి, ఎస్ సి- ఏ అరుంధతీయుల రిజర్వేషన్లు 8%కు పెంచాలని, అరుంధతీయుల అభివృద్ధి కార్పోరేషన్ ఏర్పాటు
చేయాలని, ఎస్సి కమిషన్ లో
మాదిగలకు ప్రాతినీద్యం ఇవ్వాలని, రాజకీయ రిజర్వేషన్లలో అరుంధతీయులకు వార్డు
నెంబర్ ఎంపి, ఎంఎల్ఏ కు
50% ఇవ్వాలని, వీటితో పాటు
చెన్నైలో మన వారికి ఇళ్ళ పట్టాలు, కార్పోరేషన్ స్థలాలకు అనేవి, ప్రధాన తీర తిరువళ్ళూరు జిల్లాలో ప్రత్యేక శ్మశాన వాటికలు, ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం సమర్పించినారు.

సీఎం గారు సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామి ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఎం కొండయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుకుమార్, ప్రెసిడియం చైర్మ్నన్ సిహెచ్ ఎ దేవసహాయం, అధికార ప్రతినిధి కె. కుమార్, వి. విశ్వప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ ఈ. నాగభూషణం, ఎం. బాలాజీ, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె. భాస్కర్, జాయింట్ సెక్రటరీ: డి వై శ్రీనివాస్, చెన్నై నాయకులు, జి. గోపి, రాఘవులు, వై శ్రీరామ్, సుబ్రహ్మణ్యం, కోటేశ్వరరావు, ఇజ్రాయిల్, తిరువల్లూర్ జిల్లా నాయకులు వంశీ, వాసు, కుప్పన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

………
..

]]>
https://telugunewstimes.com/mrps-state-working-committee-meets-with-chief-minister/feed/ 0
ఆర్సీబీ విజయం వేడుకల్లో విషాదం: తొక్కిసలాటలో ఏడుగురు మృతి https://telugunewstimes.com/tragedy-in-rcbs-victory-celebrations-stampede/ https://telugunewstimes.com/tragedy-in-rcbs-victory-celebrations-stampede/#respond Wed, 04 Jun 2025 13:39:41 +0000 https://telugunewstimes.com/?p=4514 బెంగళూరు: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆనందంలో ఆర్సీబీ అభిమానులు ఊగిపోయారు. కానీ ఆ ఉత్సాహం విషాదంలోకి మారింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన సంబరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడగా, కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

బుధవారం మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయంలో ఆర్సీబీ జట్టుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డి.కే. శివకుమార్ స్వాగతం పలికారు. అనంతరం జట్టు విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియంకు వెళ్లే కార్యక్రమం ఉండగా, అభిమానుల రద్దీ కారణంగా ఓపెన్ టాప్ బస్సు ఊరేగింపును రద్దు చేశారు.

స్టేడియం వద్ద నిర్వహించాల్సిన ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం కూడా తొక్కిసలాట నేపథ్యంలో రద్దయింది. భద్రతా విభాగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. అధికార వర్గాలు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

గమనిక: వేడుకల్లో పాల్గొనేవారు భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

]]>
https://telugunewstimes.com/tragedy-in-rcbs-victory-celebrations-stampede/feed/ 0
ఐపీఎల్ 2025: ఆర్సీబీ చరిత్ర సృష్టి – పూర్తిస్థాయి విజేతల జాబితా ఇదే! https://telugunewstimes.com/ipl-2025-rcb-creates-history-here-is-the-complete-list-of-winners/ https://telugunewstimes.com/ipl-2025-rcb-creates-history-here-is-the-complete-list-of-winners/#respond Wed, 04 Jun 2025 02:56:51 +0000 https://telugunewstimes.com/?p=4510 చెన్నై: ఐపీఎల్ 2025 అత్యద్భుతంగా ముగిసింది. ఓ భిన్నమైన సీజన్‌కు ముగింపు పలికింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంటూ. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ, జోష్ హేజిల్‌వుడ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఆర్సీబీ బలమైన ప్రదర్శన ఇచ్చి అభిమానుల కలను నిజం చేసింది.

అయితే, ఐపీఎల్ అంటే ఆట పరాకాష్ఠే కాదు… ప్రతి సంవత్సరం ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు, అవార్డుల పోటీలు కూడా సమానంగా ఆసక్తికరంగా ఉంటాయి. ఈసారి కూడా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ పోటీలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి.

ఐపీఎల్ 2025 అగ్రగాములు: ఎవరు ఏ అవార్డు గెలుచుకున్నారో చూడండి!

🟠 ఆరెంజ్ క్యాప్ విజేత – సాయి సుదర్శన్ (గుజరాత్ టైటన్స్)

పరుగులు: 759 (15 ఇన్నింగ్స్)

సగటు: 54.21

స్ట్రైక్ రేట్: 156.17
గుజరాత్‌కు కీలక విజయాలు అందించిన సాయిసుదర్శన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రూ.10 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు.

🟣 పర్పుల్ క్యాప్ విజేత – ప్రసిద్ధ్ కృష్ణ (గుజరాత్ టైటన్స్)

వికెట్లు: 25 (15 మ్యాచ్‌లు)

సగటు: 19.52
తన వేగంతో బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు కలిగించిన ప్రసిద్ధ్ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన ప్రత్యేక అవార్డులు

🔹 సూపర్ స్ట్రైకర్: జితేష్ శర్మ – ₹1 లక్ష

🔹 ఫాంటసీ కింగ్: శశాంక్ సింగ్ – ₹1 లక్ష

🔹 సూపర్ సిక్సెస్: శశాంక్ సింగ్ – ₹1 లక్ష

🔹 ఫోర్స్ ఆఫ్ ది మ్యాచ్: ప్రియాంశ్ ఆర్య – ₹1 లక్ష

🔹 గ్రీన్ డాట్ బాల్స్: కృనాల్ పాండ్యా – ₹1 లక్ష

🔹 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కృనాల్ పాండ్యా – ₹5 లక్షలు

ఐపీఎల్ 2025 సీజన్ అవార్డుల పూర్తి జాబితా

🏆 ఎమర్జింగ్ ప్లేయర్: సాయి సుదర్శన్ – ₹10 లక్షలు

🚀 సూపర్ స్ట్రైకర్: వైభవ్ సూర్యవంశీ – ₹10 లక్షలు

👑 ఫాంటసీ కింగ్: సాయి సుదర్శన్ – ₹10 లక్షలు

💥 సూపర్ సిక్సెస్: నికోలస్ పూరన్ – ₹10 లక్షలు

🔥 ఫోర్స్ ఆఫ్ ది సీజన్: సాయి సుదర్శన్ – ₹10 లక్షలు

🟢 గ్రీన్ డాట్ బాల్స్: మహ్మద్ సిరాజ్ – ₹10 లక్షలు

🧤 కాచ్ ఆఫ్ ది సీజన్: కమిందు మెండిస్ – ₹10 లక్షలు

🌟 ఫెయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్

💎 మోస్ట్ వ్యాల్యూవబుల్ ప్లేయర్: సూర్యకుమార్ యాదవ్ – ₹15 లక్షలు

🏟 బెస్ట్ పిచ్ & గ్రౌండ్ అవార్డు: ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ – ₹15 లక్షలు

ఐపీఎల్ 2025 బహుమతి ధనరాశులు

🏆 విజేత (RCB): ₹20 కోట్లు

🥈 రన్నరప్ (పంజాబ్ కింగ్స్): ₹12.5 కోట్లు

ఇలా 2025 ఐపీఎల్ గెలిచిన ఆటగాళ్లు మరియు జట్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో సీజన్‌ను చరిత్రలో నిలిపారు. ఇప్పుడు అభిమానులంతా వచ్చే సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు!
…………..

]]>
https://telugunewstimes.com/ipl-2025-rcb-creates-history-here-is-the-complete-list-of-winners/feed/ 0
ఆర్‌సిబికి చారిత్రక విజయం: ఐపీఎల్ ట్రోఫీపై తొలి సారిగా ముద్ర https://telugunewstimes.com/historic-win-for-rcb-first-time-ever-to-seal-ipl-trophy/ https://telugunewstimes.com/historic-win-for-rcb-first-time-ever-to-seal-ipl-trophy/#respond Tue, 03 Jun 2025 18:14:05 +0000 https://telugunewstimes.com/?p=4503 చెన్నై: ఐపీఎల్ 18వ సీజన్‌లో 10 జట్లు పోటీపడ్డ సుదీర్ఘ మల్లయుద్ధానికి ముగింపు పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) విజేతగా నిలిచింది. పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన ఆర్‌సిబి తమ ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ట్రోఫీను అందుకుంది.

టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 43 పరుగులతో అగ్ర స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామిసన్‌లు చెరో మూడు వికెట్లు తీసి రాణించారు.

191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రబ్సిమ్రాన్ సింగ్ (26) మరియు ప్రియాంష్ ఆర్య (24) శుభారంభం అందించేందుకు యత్నించారు. కానీ మద్యంలో వరుస వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ ఒత్తిడికి లోనైంది. ఇంగ్లిస్ 39 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడగా, శ్రేయస్ అయ్యర్ కేవలం ఒక్క పరుగుతో పెవిలియన్ చేరాడు.

తరువాత నేహల్ వాద్రా (15), శశాంక్ సింగ్‌లు కలిసి పునరుద్ధరణకు ప్రయత్నించినా, ఆర్‌సిబి బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను తమ దిశగా మలిచారు. చివరకు పంజాబ్ నిర్ణీత లక్ష్యానికి తక్కువగా స్కోర్ చేసి ఓటమి చవిచూసింది.

ఆర్‌సిబి విజయం తాత్కాలిక గెలుపు కాదు, ఇది వారి అభిమానులకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సంతోషాన్ని అందించింది. విజేతగా నిలిచి తొలి ట్రోఫీని ఎగరేసిన ఆర్‌సిబి ఆటగాళ్లు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు.

]]>
https://telugunewstimes.com/historic-win-for-rcb-first-time-ever-to-seal-ipl-trophy/feed/ 0
ఘనంగా మొగప్పేర్ తెలుగు కల్చరల్ అండ్ సోషల్ అసోసియేషన్ వార్షికోత్సవం https://telugunewstimes.com/gananga-mogapper-telugu-cultural-and-social/ https://telugunewstimes.com/gananga-mogapper-telugu-cultural-and-social/#respond Mon, 02 Jun 2025 13:34:31 +0000 https://telugunewstimes.com/?p=4496 విల్లివాకం: మొగప్పేర్ తెలుగు కల్చరల్ అండ్ సోషల్ అసోసియేషన్ 12వ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం చెన్నై అన్నానగర్ వెస్ట్ ఎక్స్ టెన్షన్, డీఏవీ బాలికల హయ్యర్ పాఠశాల సమీపానగల చిన్నస్వామి మ్యారేజ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా అఖిల భారత తెలుగు ఫెడరేషన్, లింగ్విస్టిక్ మైనారిటీస్ ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి విచ్చేసారు.

భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ జె.విజయలక్ష్మి, అల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ చెన్నై విభాగ జనరల్ సెక్రటరీ ఆర్. నందగోపాల్, మద్రాసు హైకోర్టు న్యాయవాది దీపన్ రాజ్ కృష్ణ, మొగప్పేర్ తెలుగు కల్చరల్ అండ్ సోషల్ ఆసోసియేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ గిరి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి వి.వీరభద్రరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ నిర్మల్ చందర్, కమిటీ మెంబెర్స్ ఇక్కుర్తి సురేష్ బాబు, గిరి, ఎంఎస్ నాయుడు, డిల్లీ బాబు, రామజయం, ముఖ్య అతిథులు అడ్వకేట్ రవీంద్రనాథ్, జేయం నాయుడు పాల్గొన్నారు. గిరి హనుమంతరావు అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. వివిబి రావు స్వాగతోపన్యాసం చేశారు. హనుమంతరావు అధ్యక్షోపన్యాసం చేశారు. అనంతరం ముఖ్య అతిథి ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ తెలుగు వారిలో ఐక్యత కొరవడిందని, అందరూ సంఘటితంగా కలిసి రావాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పుతో మైనారిటీ భాషలు సిలబస్ లోకి వచ్చాయని, విద్యార్థులు మాతృభాషలో చదువుకునేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపాలన్నారు. సంభాషణ నైపుణ్యాలు, సానుకూల దృక్పథం, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలన్నారు.

ఇందులో రాజ్ కృష్ణ, జె. విజయలక్ష్మి, నందగోపాల్, రవీంద్రనాథ్ తదితరులు ప్రసంగించారు. ఇందులో చెస్ ప్రజ్ఞానంద, కుశాల్, దియాన్ తదితర విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో అరుల్ రిథమ్స్ లైట్ మ్యూజిక్ సంగీత విభావరి, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. చివరిగా వైస్ ప్రెసిడెంట్ టిఎంకె కుమార్ వందన సమర్పణ చేశారు.

………

]]>
https://telugunewstimes.com/gananga-mogapper-telugu-cultural-and-social/feed/ 0
నెల్లూరు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్‌గా గంగోడు నాగేశ్వరరావు నియామకం https://telugunewstimes.com/gangodu-appointed-as-nellore-district-dcms-chairman/ https://telugunewstimes.com/gangodu-appointed-as-nellore-district-dcms-chairman/#respond Fri, 30 May 2025 13:18:52 +0000 https://telugunewstimes.com/?p=4489 వెంకటగిరి న్యూస్:వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావును నెల్లూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) చైర్మన్‌గా నియమించారు.ఈ సందర్భంగా గంగోడు నాగేశ్వరరావు మాట్లాడుతూ – తనపై నమ్మకంతో డిసిఎంఎస్ చైర్మన్‌గా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే భీమవరం టీడీపీ నాయకుడు ఎం. చిట్టిబాబు గంగోడు నాగేశ్వరరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

]]>
https://telugunewstimes.com/gangodu-appointed-as-nellore-district-dcms-chairman/feed/ 0
రాజ్యసభకు కమల్ హాసన్‌ పేరు ఖరారు చేసిన డీఎంకే https://telugunewstimes.com/dmk-finalises-kamal-haasans-name-for-rajya-sabha/ https://telugunewstimes.com/dmk-finalises-kamal-haasans-name-for-rajya-sabha/#respond Wed, 28 May 2025 07:03:31 +0000 https://telugunewstimes.com/?p=4484 చెన్నై న్యూస్: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీతి మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌ రాజ్యసభలో అడుగుపెట్టడానికి సమయం దగ్గరపడింది. డీఎంకే పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఈ మార్గం స్పష్టమైంది. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయన తమిళనాడు నుంచి పోటీ చేయనున్నారు.

ఈసారి రాజ్యసభలో ఖాళీ అయిన 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆరు తమిళనాడు, రెండు అసోం రాష్ట్రాల నుంచి ఉన్నాయి. తమిళనాడులోని ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం, డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో, ఆ పార్టీకి నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్టు అంచనా. మిగతా రెండు స్థానాలు అన్నాడీఎంకేకి వెళ్లే అవకాశముంది.

డీఎంకే తన అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. కమల్ హాసన్‌తో పాటు సిట్టింగ్ ఎంపీ టిరుచ్చి శివ, రచయిత్రి సల్మా, పార్టీ సీనియర్ నేత ఎస్‌ఆర్‌ శివలింగం పేర్లను వెల్లడించింది.

కమల్ హాసన్‌ 2018 ఫిబ్రవరిలో మక్కల్ నీతి మయ్యం పార్టీని ప్రారంభించినా, ఇప్పటివరకు ఎలాంటి ఎన్నికల్లోనూ విజయాన్ని నమోదు చేయలేకపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 3.72% ఓటు షేర్‌ సాధించినా, ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమల్‌ పోటీ చేసిన కోయంబత్తూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. అలాగే 2022 మునిసిపల్ ఎన్నికల్లోనూ పార్టీ ఖాతా తెరవలేదు.

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఇండియా కూటమికి మద్దతు ప్రకటించిన కమల్‌ హాసన్‌ డీఎంకేతో అణుగుణంగా పనిచేశారు. అప్పటినుంచి ఆయన రాజ్యసభ ఎంపీగా నియామకంపై చర్చలు జరుగుతున్నట్లు తమిళ రాజకీయ వర్గాలు తెలిపాయి. చివరికి, డీఎంకే ఆ అవకాశం కల్పించడంతో ఆయన పార్లమెంటులో అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది.
…………….

]]>
https://telugunewstimes.com/dmk-finalises-kamal-haasans-name-for-rajya-sabha/feed/ 0
సాహితీ స్రష్ట ‘వెన్నెలకంటి’ — విస్తాలి శంకరరావు https://telugunewstimes.com/literary-masterpiece-vennelakanti-vistali-shankara-rao/ https://telugunewstimes.com/literary-masterpiece-vennelakanti-vistali-shankara-rao/#respond Sun, 25 May 2025 19:00:38 +0000 https://telugunewstimes.com/?p=4479 విల్లివాకం న్యూస్: సాహిత్యంలోను, సినీ సాహిత్యం లోను, మరోవైపు సినీ అనువాద సాహిత్యంలోను తనదైన శైలిలో ప్రత్యేక ముద్రను ఏర్పరుచుకుని సినీ, టీవీ రంగుల ప్రపంచంలో నిండు పున్నమి వెలుగై నిలిచిన అగ్రశ్రేణి రచయిత వెన్నెలకంటి అని ఆచార్య విస్తాలి శంకరరావు కొనియాడారు. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక ప్రసంగ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. దీనికి ఆంధ్ర క్లబ్, కృష్ణా హాలు వేదికయింది. ఇందులో ‘వెన్నెలకంటి సాహిత్యం – సినీ వెన్నెల జలపాతం’ అనే అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ అధ్యక్షులు, ఆచార్య విస్తాలి శంకరరావు ప్రసంగించారు. ముందుగా ఆయనను సంస్థ అధ్యక్షులు జెకె రెడ్డి, కార్యదర్శి కందనూరు మధు సత్కరించారు. విస్తాలి శంకరరావు మాట్లాడుతూ
వెన్నెలకంటి అంటే సినీ సాహిత్యానికి ఒక ఎన్సైక్లోపీడియా, ఒక విజ్ఞాన సర్వస్వం, ఒక చమత్కారం, ఒక స్నేహం, ఒక అనువాద విజ్ఞానం అన్నారు. వెన్నెలకంటి 1957 నవంబర్ 30 వ తేదీన వెన్నెలకంటి పద్మావతమ్మ, వెన్నెలకంటి కోటేశ్వరరావు దంపతులకు నెల్లూరులో జన్మించారని,
వీరి జీవన నేపధ్యం, పరిసరాలు వీరిని విశిష్టత కలిగిన కవిలా ఎదిగేలా చేశాయన్నారు.
సాహిత్యంలోను, వ్యాకరణంలోను, భారత, రామాయణ, భాగవతాలలోను, వివిధ భాషల విజ్ఞానంలోను మంచి పట్టు ఉండడంతో అనతి కాలంలోనే అగ్రస్థానంలో నిలిచారని, వారిని
అనేక పురస్కారాలు వరించాయని తెలిపారు. సాహితీ, సినీ సాహితీ లోకంలో ‘గడ్డం లేని ఋషి ‘ గా, ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ గా, ‘డబ్బింగ్ కింగ్’ గా కీర్తిని ఆర్జించారని పేర్కొన్నారు.
ఇక వారు సినీ సాహిత్యంలో ప్రదర్శించిన సాహితీ విన్యాసాలను అనేక పాటలు ద్వారా వివరిస్తూ, ఆ పాటల సృష్టిలోని దర్శకులు, నిర్మాత లు, సంగీత దర్శకులు, గాయనీ గాయకుల నేపథ్యాలను విపులంగా వివరించారు.
వారి సాహిత్యం లోగల జోల పాటలు, భక్తి పాటలు, ప్రేమ గీతాలు, విషాద గీతాలు, సామాజిక చైతన్య గీతాలు, డబ్బింగ్ పాటలు పాడుతూ అందులోని దాగి ఉన్న భావాలు, రచనా విశేషాలు, చమత్కారాలు తెలియజేయడమే కాక తొలి తరం, మలితరం సినీ కవులకు అనుసంధాన కర్తగా వ్యవహరించన తీరును విశ్లేషించారు.
తన సినీ ప్రస్థానంలో కుటుంబ సభ్యులతో పాటు ఎదిగేందుకు ఎందరో దోహద పడ్డారని, ముఖ్యంగా గానగంధర్వులు బాలు గారి ప్రోత్సాహం మరువలేనిదని తాను తినే బియ్యపు గింజ పై బాలు గారి పేరు ఉంటుందని వెన్నెలకంటి భావించారని, అలాగే వారి స్నేహితులు గిరీశం, సుబ్బారావు గార్ల సహకారం ఎంతో ఉందని వ్యక్తం చేశారు.
వారి పేరు లో ఉన్న ‘వెన్నెల’ ను సాహిత్యంలోకి నింపి జలపాతం లా పరుగులు తీయించిన సాహితీ స్రష్ట అని వారి సాహితీ వెన్నెల జలపాత సౌందర్యాలను వివరించి శ్రోతలను అలరించారు. ఈ కార్యక్రమంలో ఆస్కా నూతన అధ్యక్షులు జి శశిధర్ రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి సహా నగర ప్రముఖులు పాల్గొన్నారు.

……………

]]>
https://telugunewstimes.com/literary-masterpiece-vennelakanti-vistali-shankara-rao/feed/ 0