Logo
Date of Publish : 09 February 2026, 11:57 pm
Editor : CH. MUKUNDARAO

ఘనంగా డాక్టర్ గొల్లపల్లి ఇశ్రాయేలు జన్మదిన వేడుకలు

విల్లివాకం న్యూస్: టామ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లపల్లి ఇశ్రాయేలు జన్మదిన వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. జనో అలూమ్ని స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చెన్నై పెరియమేట్ లోని సాల్వేషన్ ఆర్మీ హెచ్ఆర్ డి సెంటర్ వేదికయింది. ముఖ్య అతిథులుగా బిషప్ దైవ ప్రసన్న, డాక్టర్ ప్రకాష్ రాజ్, డాక్టర్ దయాపాత్ర, రెవ. ఏసుపాదం విచ్చేశారు. అలాగే, గుడిమెట్ల చెన్నయ్య తో పాటు టామ్స్ వైస్ ప్రెసిడెంట్ వి.దేవదానం, ఎస్ జయపాల్, పాల్ కొండయ్య, వి ఇశ్రాయేలు, ఏ యెషయా, ట్రెజరర్ బి ఎన్ బాలాజీ, హెడ్ క్వార్టర్స్ సెక్రటరీ సి తిరుమలరావు, మస్తాన్, యెహెఙ్కేలు, ఆర్ జయరాజ్, పెంచలయ్య లీగల్ అడ్వైజర్ జిసి నాగూర్, బలభద్ర దేవరాజ్, ఎస్ కె ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

గొల్లపల్లి ఇశ్రాయేలు మాట్లాడుతూ టామ్స్, జనోదయం నుంచి విశేష సేవలందిస్తున్నామని, మన పిల్లలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలు ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం లయోలా విద్యార్థులు నరేష్, జస్టిన్ ప్రసంగించారు. టోనీ ప్రకాష్ క్రైస్తవ భక్తి గీతాన్ని వినిపించారు. రెవరెండ్ ఏసుపాదం మాట్లాడుతూ గొల్లపల్లి ఇశ్రాయేలు ఎందరి జీవితాలను వెలిగిస్తున్నారని, ఆయన సేవలు ఇలాగే కొనసాగాలని అభిలషించారు.

ఫిబ్రవరి 22న వైఎంసిఏ, నందనంలో జరిగే కేఏ పాల్ బహిరంగ సభకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇందులో బిషప్ దైవ ప్రసన్న మాట్లాడుతూ దళిత సమాజ ఆశా కిరణం, అణగారిన వర్గాల ఆత్మ గౌరవం గొల్లపల్లి ఇశ్రాయేలు అని తెలిపారు. ఆయన సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. డాక్టర్ ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తమ చర్చ్ తరపున టామ్స్ కు ప్రతి ఏడాది రూ.25 వేలు అందజేయనున్నట్లు ప్రకటించారు. డాక్టర్ దయాపాత్ర, గుడిమెట్ల చెన్నయ్య, రంగనాథన్, పిసి నాగూర్, దేవదానం, సీనియర్ లాయర్ శ్రీనివాసులు, పాలకొండయ్య తదితరులు ప్రసంగించారు. పాస్టర్ దేవదాస్ ప్రార్ధన చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. చివరిగా గొల్లపల్లి ఇశ్రాయేలు వందన సమర్పణ చేశారు.

...........


All Rights Reserved By telugunewstimes
Print Save