Logo
Date of Publish : 25 June 2026, 12:53 pm
Editor : CH. MUKUNDARAO

రూ.127.21 కోట్లతో 300 కొత్త బస్సులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి విజయ్

చెన్నై న్యూస్: తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి తిరు ఎస్. జోసెఫ్ విజయ్ నేడు (25-06-2026) సచివాలయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అందించారు. రాష్ట్ర రవాణా సంస్థల కోసం రవాణా శాఖ రూ.127.21 కోట్ల వ్యయంతో సమకూర్చిన 300 కొత్త ప్రయాణికుల బస్సులను ఆయన జెండా ఊపి ప్రజా సేవలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన, సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సుల ప్రారంభోత్సవం అనంతరం, మెట్రోపాలిటన్ రవాణా సంస్థ నిర్వహిస్తున్న 29ఏ మార్గంలోని ఒక కొత్త బస్సులో ముఖ్యమంత్రి స్వయంగా ప్రయాణించి సేవలనుపరిశీలించారు.

ఈ కొత్త బస్సుల ప్రవేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా రవాణా అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.
.........


All Rights Reserved By telugunewstimes
Print Save