ఆరోగ్యం – telugu news times https://telugunewstimes.com తెలుగు న్యూస్ టైమ్స్ Tue, 07 Apr 2026 03:42:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://telugunewstimes.com/wp-content/uploads/2024/08/cropped-tnt-1-32x32.jpg ఆరోగ్యం – telugu news times https://telugunewstimes.com 32 32 7 నుంచి ఉచిత వైద్య ఆహార నాడీ చికిత్సా శిబిరం https://telugunewstimes.com/free-medical-dietary-and-naturopathy-camp-from-the-7th/ https://telugunewstimes.com/free-medical-dietary-and-naturopathy-camp-from-the-7th/#respond Tue, 07 Apr 2026 03:41:54 +0000 https://telugunewstimes.com/?p=5810 విళ్లివాకం న్యూస్: సాయి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్,
కార్నేషన్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంయుక్త ఆధ్వర్యంలో 15 రోజుల ఉచిత వైద్య ఆహార నాడీ చికిత్సా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు, ఎన్. రాజేష్ కుమార్, కార్యదర్శి టిపి రాజా, కోశాధికారి
ఎన్.సి. సుమేష్ ఆదిత్య, కమిటీ చైర్మన్, ఎన్. జయరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరం
07 ఏప్రిల్ 2026 నుండి 21 ఏప్రిల్ 2026 వరకు
సమయం: ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. శిబిరం ఏర్పాటయిన స్థలం :
కార్నేషన్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి, నెం. 42, కస్తూరిబాయి స్ట్రీట్, కార్నేషన్ నగర్, కొరుక్కుపేట్, చెన్నై – 600021. ఫుట్ పల్స్ థెరపీ తీసుకోవడం వల్ల ఈ క్రింది సమస్యల నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది. ప్రఖ్యాత డయాబెటాలజిస్టులు, న్యూరాలజిస్టులు, స్పోర్ట్స్ ఆర్డో మరియు ఫిజియోథెరపిస్టులచే ఆమోదించబడింది. క్లినికల్ గా నిరూపించబడిన టిఈఎన్ఎస్ మరియు ఈఎంఎస్ చికిత్సా పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9344402526/9344417476 సెల్ నంబర్లను సంప్రదించవచ్చు.
…….

]]>
https://telugunewstimes.com/free-medical-dietary-and-naturopathy-camp-from-the-7th/feed/ 0
ఉచిత కంటి పరీక్షల శిబిరానికి అనూహ్య స్పందన https://telugunewstimes.com/overwhelming-response-to-free-eye-check-up-camp/ https://telugunewstimes.com/overwhelming-response-to-free-eye-check-up-camp/#respond Sun, 29 Mar 2026 17:55:24 +0000 https://telugunewstimes.com/?p=5803 విళ్లివాకం న్యూస్: చెన్నై, పెరంబూరు పటేల్ రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర భక్త సమాజం, ఆళ్వారు పేట, ఉది కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం ఆదివారం ఉదయం ఆనంద నిలయం వేదికగా జరిగింది. దీనిని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త డి. జంబు దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దాదాపు 300 మందికి పరీక్షలు జరిపారు. 200 మందికి ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు.

అలాగే, అవసరమైన వారికి ఆస్పత్రిలో చేర్చి వెంటనే ఆపరేషన్లకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి ఎస్ వెంకట్రామన్, ట్రెజరర్ హెచ్ వెంకట రమణుడు, సహాయ కార్యదర్శి పి రవి కుమార్, ట్రస్టీ పి రామచంద్రన్ తదితర కార్యవర్గ సభ్యులందరూ, జనని కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పాల్గొన్నారు.

 

]]>
https://telugunewstimes.com/overwhelming-response-to-free-eye-check-up-camp/feed/ 0
డయాబెటిస్ ఉన్నవారిలో ఉదయపు షుగర్ ఎందుకు పెరుగుతుంది? https://telugunewstimes.com/why-does-morning-sugar-rise-in-people-with-diabetes/ https://telugunewstimes.com/why-does-morning-sugar-rise-in-people-with-diabetes/#respond Tue, 10 Feb 2026 18:12:46 +0000 https://telugunewstimes.com/?p=5511 మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి ఆహారం, వ్యాయామం, మందులపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. అయినప్పటికీ, రాత్రంతా ఏమీ తినకపోయినా ఉదయాన్నే ఫాస్టింగ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా కనిపించడం చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ‘డాన్ ఎఫెక్ట్’ అని పిలుస్తారు. ఈ సమస్యను కేవలం ఆహారం మార్చడం ద్వారా మాత్రమే నియంత్రించడం సాధ్యం కాదని, ఉదయాన్నే మనం పాటించే అలవాట్లే ఇందులో కీలక పాత్ర పోషిస్తాయని ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్ నిపుణుడు డాక్టర్ మోహిత్ శర్మ వెల్లడించారు.

డాన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి?
తెల్లవారుజామున మన శరీరం సహజంగా కార్టిసాల్, అడ్రినలిన్, గ్లూకాగాన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి శరీరానికి శక్తిని అందించేందుకు కాలేయం నుంచి గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేస్తాయి. సాధారణ వ్యక్తుల్లో ఇన్సులిన్ దీనిని సమతుల్యం చేస్తుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సరైనంగా పనిచేయకపోవడంతో షుగర్ స్థాయిలు పెరుగుతాయి.

నిద్రలేవగానే టెన్షన్ వద్దు
ఉదయం లేవగానే ఫోన్ చూడడం, ఆఫీస్ పనుల గురించి ఆలోచించడం వంటి అలవాట్లు ఒత్తిడిని పెంచుతాయి. దీని వల్ల చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లేచిన వెంటనే 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, లోతుగా శ్వాస తీసుకోవడం మేలు చేస్తుంది.

నీరు తాగడం మొదటి పని కావాలి
రాత్రి నిద్రలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా కనిపిస్తుంది. నిద్రలేచిన వెంటనే 1–2 గ్లాసుల సాధారణ నీరు తాగడం వల్ల కిడ్నీలు గ్లూకోజ్‌ను సరిగ్గా వడపోసేందుకు సహాయపడతాయి.
తేలికపాటి కదలికలు చాలాయి
ఖాళీ కడుపుతో తీవ్రమైన వ్యాయామాలు చేయడం శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది. బదులుగా అల్పాహారానికి ముందు 10–15 నిమిషాలు నడక, సాగదీత వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి.

ఉదయపు ఎండ అవసరం
ఉదయాన్నే కొన్ని నిమిషాలు సూర్యరశ్మిలో ఉండటం శరీరంలోని జీవగడియారాన్ని సరిచేస్తుంది. దీని వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగుపడి షుగర్ నియంత్రణకు తోడ్పడుతుంది.

ఖాళీ కడుపుతో టీ–కాఫీ వద్దు
ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకుంటే అడ్రినలిన్ హార్మోన్ విడుదలై షుగర్ అకస్మాత్తుగా పెరుగుతుంది. కాబట్టి టీ లేదా కాఫీ తాగాలనుకుంటే అల్పాహారం తర్వాత లేదా నీరు తాగిన అనంతరం తీసుకోవడం మంచిది.

ప్రోటీన్‌తో కూడిన అల్పాహారం
ఉదయపు భోజనంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువైతే షుగర్ వేగంగా పెరుగుతుంది. గుడ్లు, పెరుగు, పనీర్, మొలకలు, బాదం వంటి ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ అనేది అల్పాహారంతో కాదు… మీరు కళ్లు తెరిచిన మొదటి నిమిషంతోనే ప్రారంభమవుతుందని డాక్టర్ మోహిత్ శర్మ తెలిపారు. ఇవి మందులకు ప్రత్యామ్నాయం కాకపోయినా, మందుల ప్రభావాన్ని మరింత పెంచుతాయని సూచించారు.
……….

]]>
https://telugunewstimes.com/why-does-morning-sugar-rise-in-people-with-diabetes/feed/ 0
ఉచిత వైద్య శిబిరం చేసుకోండి https://telugunewstimes.com/organize-a-free-medical-camp/ https://telugunewstimes.com/organize-a-free-medical-camp/#respond Sun, 08 Feb 2026 19:32:43 +0000 https://telugunewstimes.com/?p=5489 వేలూరు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు కాట్పాడి రోటరీ క్లబ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఎడిష పారామెడికల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో మెగా గుండె సంబంధమైన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో రోటరీ క్లబ్ గవర్నర్ సురేష్ మేయర్ సుజాత పారామెడికల్ వ్యవస్థాపకులు చార్లెస్ రాజకుమార్ ప్రవీణ్ ఆడిటర్ పాండియన్ రెడ్ క్రాస్ మేనేజర్ దీపక్ లతోపాటు కరెక్ట్ సభ్యులు పాల్గొన్నారు.

మునేశ్వర ఆలయంలో మహా కుంభాభిషేకం

 

వేలూరు కార్పొరేషన్ పరిధిలోని చిన్న అల్లాపురం కలతమేడులోని శ్రీ రాజ మునేశ్వర ఆలయంలో అష్టబంధ మహా కుంభాభిషేకం అతి వైభవంగా జరిగింది ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా మరగత కొట్టాయా శ్రీ వారాహి పీఠం పోయేగే మోటార్ వారాహి దర్శన్ శ్రీ రాజ వీర మునేశ్వర సిద్దర్ పీఠం నుంచి శివాచారులు పాల్గొని రాజమహేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పుష్పాలంకరణలు చేసి ఆలయ విగ్రహంపై ప్రత్యేక కలసి నీటిని పోసి కుంభాభిషేకం నిర్వహించారు ఇందులో గౌరవ అధ్యక్షులు దామోదరం సుబ్రహ్మణ్యం గోవింద్ స్వామి రాజేంద్రన్ ధరణి సమన్వయకర్తలు వేడుక బృందం సెందిల్ కుమార్ కార్యదర్శి శరవణ కోశాధికారి మణికంఠం అకౌంటెంట్ జాయింట్ కార్యదర్శులు కృష్ణ లత పాటు స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కాట్పాడి గాంధీ నగర్ లో బాడీ క్రాఫ్ట్ క్లినిక్ ప్రారంభం

వేలూరు కార్పొరేషన్ పరిధిలోని కాట్పాడి పాత వినాయకుని గుడి సమీపంలో గాంధీనగర్ లోని తూర్పు ప్రధాన రోడ్డులో బాడీ క్రాఫ్ట్ క్లినిక్ మరియు సెలూన్ వేలూరు పార్లమెంటు సభ్యులు కదీర్ ఆనంద్ ఎమ్మెల్యే నందకుమార్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఇందులో డిప్యూటీ మేయర్ సునీల్ కుమార్ డీఎంకే పార్టీ నార్త్ ఏరియా కార్యదర్శి వన్ ఇయర్ రాజా గాంధీనగర్ డివిజన్ కార్యదర్శి పరమశివం బడి క్రాఫ్ట్ క్లినిక్ అండ్ సెలూన్ యజమాని నరేంద్ర కళ్యాణి సుందర్ విష్ణు లతోపాటు డాక్టర్ మిక్కీ సింగ్ పులివెందుల సుధాకర్ రెడ్డి వ్యాపారవేత్తలు కస్టమర్లు పాల్గొన్నారు.

వైభవంగా మహా కుంభాభిషేకం

వేలూరు పట్టణంలోని విరుపాక్షిపురం రత్నగౌండర్ రోడ్డు కేకే నగర్ లోని శ్రీ ముత్తు మారియమ్మ ఆలయ అష్ట బంధన మహా కుంభాభిషేక వైభవ్ ఆదివారం ఉదయం అతి వైభవంగా జరిగింది ముందుగా రెండవ గోపూజ నవగ్రహ పూజ లక్ష్మీ హోమం రాజగోపరానికి కళాశాభిషేకం స్వామివారి విగ్రహం ఏర్పాటు దీపారాధన పూజలు పుష్పాలంకరణలు నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రత్యేక అన్నదానం ఏర్పాటు చేశారు మీ పూజల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నందకుమార్ తోపాటు పలువురు భక్త సభ బంధం స్థానికులు మహిళ భక్తులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి చెస్ పోటీలు

వేలూరు శ్రీపురం బంగారు గుడి శ్రీ నారాయణ పీఠం పీఠాధిపతి శక్తి అమ్మ 50 వ జయంతిని పురస్కరించుకొని వేలూరు అడుకుంబర లోని శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు నిర్వహకులు దినకరన్ వసంత కుమారి దినగరం లో అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జి పి సి ప్రకాష్ లతోపాటు రాయవేలూరు చెస్ అసోసియేషన్ అధ్యక్షులు మనోహరన్ లు పాల్గొని పర్యవేక్షించారు

]]>
https://telugunewstimes.com/organize-a-free-medical-camp/feed/ 0
12 ఏళ్ల డయాబెటిస్‌కు మందుల్లేకుండా చెక్… https://telugunewstimes.com/12-years-of-diabetes-brought-under-control-without-medication/ https://telugunewstimes.com/12-years-of-diabetes-brought-under-control-without-medication/#respond Thu, 22 Jan 2026 01:12:57 +0000 https://telugunewstimes.com/?p=5401 న్యూట్రిషనిస్ట్ సూచించిన 3 సింపుల్ లైఫ్ స్టైల్ సీక్రెట్స్!
నేటి ఆధునిక జీవనశైలిలో మధుమేహం (డయాబెటిస్) ప్రతి ఇంట్లోనూ కనిపించే సమస్యగా మారింది. అనియమిత ఆహారం, శారీరక చురుకుతనం లేకపోవడం, అధిక ఒత్తిడి వంటి కారణాలే దీనికి ప్రధాన మూలాలు. అయితే సరైన జీవనశైలి మార్పులు చేస్తే డయాబెటిస్‌ను నియంత్రించడమే కాకుండా, కొందరిలో మందులు లేకుండానే సాధారణ స్థాయికి తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ హర్షిత కౌశిక్ తన అనుభవం ద్వారా వెల్లడించారు. 12 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్న 42 ఏళ్ల వ్యక్తి, కేవలం మూడు కీలక మార్పులతో మందులు అవసరం లేకుండా ఆరోగ్యంగా మారాడని ఆమె తెలిపారు. ఆ మార్పులు ఏమిటంటే…

1. రాత్రి భోజనంలో కీలక మార్పు
డయాబెటిస్ ఉన్నవారు డిన్నర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి భోజనం ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండేలా ప్లాన్ చేయాలని న్యూట్రిషనిస్ట్ సూచిస్తున్నారు.
సోయాబీన్ సలాడ్, నల్ల శనగలు, మొలకెత్తిన గింజల సలాడ్ వంటి ఆహారాలు చక్కగా పనిచేస్తాయి. రాత్రి వేళ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నం, రోటీలు వంటి వాటిని తగ్గించడమే మంచిది.

2. భోజన సమయ నియమం + చిన్న నడక
రాత్రి భోజనాన్ని ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల లోపే పూర్తి చేయడం చాలా ముఖ్యం. భోజనం చేసిన వెంటనే కూర్చోకుండా, 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.
ఈ చిన్న మార్పు బ్లడ్ షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

3. ఆయుర్వేద మూలిక ‘గుడ్‌మార్’ వినియోగం
డయాబెటిస్ నియంత్రణలో ఆయుర్వేదం కూడా మంచి సహాయమే. పడుకునే ముందు 30 నిమిషాలకే ‘గుడ్‌మార్’ (తెలుగులో పొడపత్రి)తో తయారుచేసిన టీ తీసుకోవడం ఆ వ్యక్తికి మంచి ఫలితాలు ఇచ్చిందని డాక్టర్ హర్షిత తెలిపారు.
ఈ మూలికను ఆయుర్వేదంలో ‘షుగర్ నాశిని’గా పిలుస్తారు. ఇది షుగర్ స్పైక్స్ తగ్గించడమే కాకుండా, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సహజంగా ప్రోత్సహిస్తుంది.

]]>
https://telugunewstimes.com/12-years-of-diabetes-brought-under-control-without-medication/feed/ 0
కావేరి హాస్పిటల్ లో ఎలక్ట్రోఅనాటమికల్ మ్యాపింగ్ టెక్నాలజీ ప్రారంభం https://telugunewstimes.com/electroanatomical-mapping-technology-launched-at-kaveri-hospital/ https://telugunewstimes.com/electroanatomical-mapping-technology-launched-at-kaveri-hospital/#respond Thu, 08 Jan 2026 15:59:18 +0000 https://telugunewstimes.com/?p=5222 విళ్లివాకం న్యూస్ : చెన్నై, వడపళనిలోని కావేరి హాస్పిటల్ తమిళనాడులో మొట్టమొదటిసారిగా,
సంక్లిష్ట గుండె లయ రుగ్మతలకు అత్యాధునిక కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ చికిత్సలను అందించడానికి అధునాతన ఎలక్ట్రోఅనాటమికల్ మ్యాపింగ్ టెక్నాలజీని గురువారం ప్రారంభించింది. ఈ వ్యవస్థను నటుడు ఆర్. శరత్‌కుమార్, కావేరీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సహ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మరియు వడపళనిలోని కావేరీ హాస్పిటల్‌ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ సీనియర్ కన్సల్టెంట్, డైరెక్టర్ డాక్టర్ దీప్ చంద్ రాజా సమక్షంలో ప్రారంభించారు. నటుడు శరత్‌కుమార్ మాట్లాడుతూ గుండె ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ దానిని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం అన్నారు. సరైన ఆహారాన్ని తీసుకోవడం రోజువారీ దినచర్యలలో క్రమశిక్షణను పాటించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఒత్తిడి లేని జీవితాన్ని గడపడం గుండెను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తాయన్నారు. డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్, మాట్లాడుతూ ఈ అధునాతన సాంకేతికతలు సవాలుతో కూడిన సందర్భాలలో కూడా అధిక భద్రత మరియు విజయాల రేటుతో విధానాలను నిర్వహించడానికి మాకు వీలు కల్పిస్తాయని, కావేరి హాస్పిటల్‌ గుండె చికిత్సలలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందన్నారు. విదేశాలలో వైద్య చికిత్సలకు ధీటుగా ఇక్కడ చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ దీప్ చంద్ రాజా మాట్లాడుతూ, “గుండె యొక్క విద్యుత్ వ్యవస్థలో కొత్త షార్ట్ సర్క్యూట్లు అభివృద్ధి చెందినప్పుడు గుండె లయ రుగ్మతలు సంభవిస్తాయని, రోగులు దడ, తలతిరగడం, ఊపిరి ఆడకపోవడం లేదా మూర్ఛపోవడం అనుభవించవచ్చన్నారు. వాటిని రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌తో సురక్షితంగా సులభంగా చికిత్స చేయవచ్చన్నారు. ఈ కొత్త ఆవిష్కరణలతో అత్యంత అధునాతన చికిత్సలను మేము అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పలువురు వైద్య ప్రతినిధులు పాల్గొన్నారు.

]]>
https://telugunewstimes.com/electroanatomical-mapping-technology-launched-at-kaveri-hospital/feed/ 0
ఎంజీఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధునాతన శస్త్రచికిత్స https://telugunewstimes.com/mgm-cancer-institute-advanced-surgery/ https://telugunewstimes.com/mgm-cancer-institute-advanced-surgery/#respond Wed, 07 Jan 2026 05:08:35 +0000 https://telugunewstimes.com/?p=5205 విళ్లివాకం న్యూస్: ఎంజీఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌లోని వైద్యులు 41 ఏళ్ల మగ ధూమపానం చేసే వ్యక్తికి నాలుక క్యాన్సర్ (స్క్వామస్ సెల్ కార్సినోమా) కు విజయవంతంగా అధునాతన శస్త్రచికిత్స చేశారు. కణితిని పూర్తిగా తొలగించిన తర్వాత, వైద్యులు నాలుక మరియు నోటిని ఉచిత ఫ్లాప్ పునర్నిర్మాణం ఉపయోగించి పునర్నిర్మించారు. ఇది శరీరంలోని మరొక భాగం నుండి ఆరోగ్యకరమైన కణజాలాన్ని సాధారణ ఆకారం మరియు పనితీరును పునరుద్ధరించడానికి ఉపయోగించే అధునాతన సాంకేతికత. చివరి దశగా, మైక్రోస్కోపిక్ స్థాయిలో మిగిలిన క్యాన్సర్ కణాలను తొలగించడానికి రేడియేషన్ థెరపీని నిర్వహించారు. మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ – డాక్టర్ ఎం.ఎ. రాజా, సర్జికల్ ఆంకాలజీ హెచ్ఓడి మరియు సీనియర్ కన్సల్టెంట్ – డాక్టర్ శివరామ్ గణేశమోని, సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ – డాక్టర్ మణికండన్ వెంకటసుబ్రమణియన్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఎ. శివ కుమార్ బృందం నిర్వహించింది. డాక్టర్ రాజా మాట్లాడుతూ ధూమపానం చేసే రోగికి నిరంతర పుండు మరియు నాలుకపై అసాధారణ పెరుగుదల కనిపించిందని, క్లినికల్ పరీక్షలో నోటి ముందు నాలుక మరియు నోటి లోపలి భాగం విస్తృతంగా చేరినట్లు వెల్లడైంది. బయాప్సీలో నోటి క్యాన్సర్ యొక్క సాధారణ రూపమైన స్క్వామస్ సెల్ కార్సినోమా నిర్ధారించబడిందన్నారు. డాక్టర్ శివరామ్ గణేశమోని మాట్లాడుతూ ఈ కేసులో మల్టీమోడాలిటీ నైపుణ్యం ఏకీకరణను హైలైట్ చేసిందని, అసాధ్యమైన క్లినికల్ ఫలితాలను అందించిందన్నారు. డాక్టర్ మణికందన్ వెంకటసుబ్రమణియన్ మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సలో యాంటీరియర్ టోటల్ గ్లోసెక్టమీ ఉందని, ఇది నాలుక ముందు భాగాన్ని పూర్తిగా తొలగించడం, అదనంగా, కుడి వైపున ఉన్న దవడ ఎముక యొక్క ప్రభావిత భాగాన్ని తొలగించడానికి సెగ్మెంటల్ మాండిబ్యులెక్టమీని నిర్వహించడం జరిగిందని, హైయోయిడ్ ఎముకను కూడా తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి వ్యాధి నుంచి కోలుకుని తన సాధారణ జీవితానికి తిరిగి చేరుకున్నట్లు తెలిపారు.
………..

]]>
https://telugunewstimes.com/mgm-cancer-institute-advanced-surgery/feed/ 0
వేలూరు డాక్టర్ కు* *ఉత్తమ వైద్య* *సేవకైన్ అవార్డు*లండన్ అవార్డు ప్రధానం https://telugunewstimes.com/vellore-doctor-receives-london-award-for-outstanding-medical-service/ https://telugunewstimes.com/vellore-doctor-receives-london-award-for-outstanding-medical-service/#respond Sun, 04 Jan 2026 13:40:13 +0000 https://telugunewstimes.com/?p=5189 వేలూరు న్యూస్ :వేలూరు, ఆరోగ్య క్లినిక్ నిర్వాహకులు, హోమియోపతి వైద్యుడు వి.ఆర్.సుదాకర్, బిత్తబాయి కళ్లను శస్త్రచికిత్స చికిత్స ఇంట్రీ కరైక్ చేయడానికి ఉత్తమ వైద్య సేవ కోసం అవార్డును అందించారు. ఇంగ్లండ్ దేశం పార్లిమెంటానా లండన్ హౌస్ ఆఫ్ లార్డ్ సిస్ లో జరిగిన ‘సి లీడర్షిప్ సమ్మిట్ ఈవెంట్’ ఈ అవార్డును అందించింది. ఈవిహావియాలో పార్లీ మెంటిన్ ముఖ్య అతి కారులు సహా పలువురు పాల్గొన్నారు, సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడే సేవలను మనస్ఫూర్తిగా అందించారు. ఆ ప్రాథమిక యిల్, వేలూరైచ్‌కు చెందిన డాక్టర్ వి.ఆర్.సుతాకర్ గత అనేక సంవత్సరాలుగా పిత్తబాయి విద్యార్థులకు శస్త్రచికిత్స చికిత్స లేకుండా హోమియోపతి మరుత్ దువ్వెన చికిత్స అందించడం ద్వారా, దాని ద్వారా పల్లవికి వచ్చిన రోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ అవార్డును అందించారు. ముఖ్యమైన రకం, డాక్టర్ సుధాకర్ ఇప్పటికే కిట్ని కృతులకు చికిత్స పద్ధతిలో 2 ప్రపంచ రికార్డులు పొందినవారు అనేది చాలా ముఖ్యమైనది. అతను పొందిన అంతర్జాతీయ అవార్డు, హోమియోపతి వైద్య విభాగానికి గర్వకారణం.

]]>
https://telugunewstimes.com/vellore-doctor-receives-london-award-for-outstanding-medical-service/feed/ 0
ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ లో విజయవంతంగా ఆటోగ్రాఫ్ట్ కార్టిలేజ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ https://telugunewstimes.com/autograft-cartilage-tissue-transplant-successfully-performed-at-lur/ https://telugunewstimes.com/autograft-cartilage-tissue-transplant-successfully-performed-at-lur/#respond Sat, 27 Dec 2025 15:01:46 +0000 https://telugunewstimes.com/?p=5119 విళ్లివాకం న్యూస్: ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్, అడయార్ ఐదవ తరం ఆటోగ్రాఫ్ట్ కార్టిలేజ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహించింది, ఇది ఒక అధునాతన డేకేర్ ఆర్థ్రోస్కోపిక్ టెక్నిక్, ఇది రోగులు శస్త్రచికిత్స తర్వాత వెంటనే నడవడానికి వీలు కల్పిస్తుంది మరియు మొత్తం మోకాలి మార్పిడి అవసరాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
53 ఏళ్ల పెద్దమనిషి మోకాలిలో ఒక ఆటోగ్రాఫ్ట్ కార్టిలేజ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌తో దీర్ఘకాలిక ఫలితాలను సాధించింది. ఈ ఐదవ తరం ఆటోగ్రాఫ్ట్ కార్టిలేజ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇంప్లాంట్లు, క్రచెస్ లేదా ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ అవసరం లేకుండా రోగులు వెంటనే నడవడానికి సహాయపడుతుంది. ఆర్థోపెడిక్స్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నందకుమార్ సుందరం మాట్లాడుతూ ‘గాయం, అరిగిపోవడం లేదా ఆర్థరైటిస్ కారణంగా కీలులోని మృదువైన, కుషన్ లాంటి మృదులాస్థి దెబ్బతిన్న సందర్భాల్లో, దానిని పునరుద్ధరించడానికి మరియు మృదువైన కీళ్ల కదలికను నిర్వహించడానికి ప్రత్యేక పద్ధతులు అవసరం. అందుబాటులో ఉన్న ఎంపికలలో, ఆటోగ్రాఫ్ట్ కార్టిలేజ్ కణజాల మార్పిడి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో అంటుకట్టుట తయారీ, పిఆర్పి అప్లికేషన్, రోగి స్వంత రక్తం నుండి ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మాను ఉపయోగించి వైద్యంను ప్రోత్సహించడం మరియు అంటుకట్టుటను భద్రపరిచే సహజ జీవసంబంధమైన అంటుకునే ఫైబ్రిన్ గ్లూ ఫిక్సేషన్ ఉంటాయి. ఈ దశలన్నీ ఒకే, కనిష్ట ఇన్వాసివ్ ఆర్థ్రోస్కోపిక్ విధానంలో పూర్తవుతాయి. బ్రేస్‌లు లేదా సహాయక మద్దతు అవసరం లేకుండా రోగులు శస్త్రచికిత్స తర్వాత వెంటనే నడవగలరు. ఈ శస్త్రచికిత్స నొప్పిని తగ్గిస్తుంది, చలనశీలతను మెరుగుపరుస్తుంది, క్రీడలు లేదా బాధాకరమైన గాయాలను మరమ్మతు చేస్తుంది మరియు ఆర్థరైటిస్ పురోగతిని నిరోధించడానికి లేదా ఆలస్యం చేయడానికి సహాయపడుతుందన్నారు.
ఈ ప్రక్రియ యొక్క విజయం కఠినమైన రోగి-ఎంపిక ప్రమాణాలపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ సుందరం నొక్కిచెప్పారు. సముచితంగా ఎంపిక చేయబడినప్పుడు, రోగులు గణనీయమైన నొప్పి నివారణ, మెరుగైన చలనశీలత మరియు దీర్ఘకాలిక కీళ్ల జీవితకాలం అనుభవిస్తారు, మొత్తం మోకాలి మార్పిడి అవసరాన్ని సమర్థవంతంగా ఆలస్యం చేస్తారని ఆయన తెలిపారు.
ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్, అడయార్‌లోని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ భట్ మాట్లాడుతూ ఈ దీర్ఘకాలిక విజయం మెరుగుపడే కనిష్ట ఇన్వాసివ్ ఆవిష్కరణకు మా నిబద్ధతను హైలైట్ చేస్తుందన్నారు.

]]>
https://telugunewstimes.com/autograft-cartilage-tissue-transplant-successfully-performed-at-lur/feed/ 0
జికెఎం లయన్స్ క్లబ్ తరపున వితరణ https://telugunewstimes.com/donation-from-gkm-lions-club/ https://telugunewstimes.com/donation-from-gkm-lions-club/#respond Sat, 27 Dec 2025 14:04:24 +0000 https://telugunewstimes.com/?p=5112 విళ్లివాకం న్యూస్: జికెఎం లయన్స్ క్లబ్ తరపున, జికె వాసన్ పుట్టినరోజు సందర్భంగా, చెన్నై, మైలాపూర్‌లోని లయన్స్ రక్త శుద్ధి కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి చికిత్స భత్యం మరియు పండ్ల పళ్ళెం పంపిణీ చేశారు. తమిళనాడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జి ఆర్ వెంకటేష్, రాజం ఎంపి నాథన్, లయన్స్ గవర్నర్లు మురుగన్, ఎన్ ఆర్ డి ప్రేమ్‌కుమార్, పి.పి. కన్నన్ వారికి బహుమతిని అందజేశారు. ఈ బహుమతితో పాటు క్లబ్ అధ్యక్షుడు టి. రఘు, లయన్స్ సభ్యులు పార్థసారథి, సహాయరాజ్ రవి, శరవణన్, రాజసెల్వ, శ్రీనివాసన్, మరియు ఎస్ ఆర్ కాజల్ రవి ఉన్నారు.

]]>
https://telugunewstimes.com/donation-from-gkm-lions-club/feed/ 0