చెన్నై న్యూస్: చెన్నై మహానగరం లోని న్యూ అవడి రోడ్డు గాంధీనగర్ ఈ సి ఐ బెరకా తెలుగు చర్చ్ నూతన కమిటీ నియామకం ఘనంగా ఆదివారం జరిగింది. ఈ సి ఐ సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ ఆర్కే అబెల్ నీలకంఠన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఈ సీఐ బిషప్ ప్రెసిడెంట్ డాక్టర్ స్టీఫెన్ ఈ డానియల్, తెలుగు మద్రాస్ ఏరియా చైర్మన్ రెవ ఎం సురేష్ బాబు, టామ్స్ ఫౌండర్ డాక్టర్ గొల్లపల్లి ఇజ్రాయిల్, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిషప్ ప్రెసిడెంట్ డాక్టర్ స్టీఫెన్ ఈ డేనియల్ మాట్లాడుతూ...1 తిమోతి 3:15, 1 పేతురు5:1-4 ఆధారంగా దైవ వాక్యాన్ని బోధించారు. 2026-2028 సంవత్సరానికి గాను చర్చి నూతన కమిటీ, సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు నియమించే వారికి ప్రార్థించి , అభిషేకంచారు.

[caption id="attachment_5384" align="alignnone" width="300"]
అనంతరం ముఖ్య అతిథులను గౌరవించారు. అలాగే నూతన కార్యవర్గాన్ని శాలువులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పి తిమోతి, పాస్టర్ జి బాబు, పాస్టర్ సిహెచ్ ముకుందరావు, సంఘ కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యవనస్తులు తదితరులు పాల్గొన్నారు.[/caption]
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com