Logo
Date of Publish : 28 January 2026, 10:25 am
Editor : CH. MUKUNDARAO

అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి

చెన్నై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురైంది. పుణే జిల్లాలోని బారామతి ప్రాంతంలో ఉదయం 8:45 గంటల సమయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో విమానం కూలిపోయినట్లు సమాచారం.
విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన భద్రతా సిబ్బంది సహా మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. విమానం కూలిన అనంతరం అజిత్ పవార్‌ను సహాయక బృందాలు బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్లు తొలుత సమాచారం వెలువడింది.
అయితే, ఈ ఘటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.


All Rights Reserved By telugunewstimes
Print Save