Logo
Date of Publish : 20 September 2024, 4:59 pm
Editor : CH. MUKUNDARAO

హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై చర్యలు తీసుకోండి!

విల్లివాకం న్యూస్: తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు తయారీలో వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న పరిస్థితుల వల్ల భక్తుల ఆందోళన చెందుతున్నారు. అలాగే, హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న వాళ్లు ఎవరైనా సరే విచారణ చేసి తప్పు ఉంటే శిక్ష వేయడం లేదంటే తప్పు దోవ పట్టిస్తున్న వాళ్ళకి శిక్ష వేయవలసిందిగా హిందువుల తరఫున తాము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు చేసినా తప్పు తప్పే, దీన్ని తప్పకుండా ప్రతి హిందువు పోరాడాల్సిన అవసరం వచ్చింది. హిందువుల ఆలయాల గురించి హిందువుల గురించి ఇది మొదటి సారి కాదు. హిందువుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఎలా మాట్లాడాలో ఈ శిక్ష ద్వారా ప్రతి ఒక్కరికి భయం అనేది ఉండాలి! అని తెలియజేస్తున్నామని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు, జి మురళి, చెన్నై డిమాండ్ చేశారు.


All Rights Reserved By telugunewstimes
Print Save