Logo
Date of Publish : 31 July 2024, 8:54 pm
Editor : CH. MUKUNDARAO

బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముద్దాయికి ఉరి శిక్ష

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచ లన తీర్పు వెలువడించింది. బాలిక పై అత్యాచారం హత్య కేసులో ముద్దాయికి ఉరి శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది.

2018లో నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై దినేష్ తాపీ కార్మికుడు అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఈ కేసులో 2021లోనే రంగారెడ్డి కోర్టు దోషికి ఉరిశిక్ష విధించింది.

ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగ్గా రంగారెడ్డి కోర్టు తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించింది.

కాగా, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు సెంట్రింగ్ పనిచేసే కార్మికుడిగా పోలీసులు గుర్తించారు.


All Rights Reserved By telugunewstimes
Print Save