ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు తమిళనాడు ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన నివాసం ఉన్న చెన్నై నుంగంబాక్కంలో కాందార్ మెయిన్ రోడ్డు ను ఎస్పీ బాలసుబ్రమణ్యం రోడ్డుగా మార్చుతూ ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు.అంతకుముందు దివంగత ఎస్ పి బి కుమారుడు చరణ్ ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఇదే విషయమై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఎస్పిబి అభిమానులు కృతజ్ఞతలు తెలియజేశారు. టి నగర్ న్యూస్.