ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

చెన్నై, న్యూస్: తెలుగు భాషా పరిరక్షణ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలందిస్తున్న ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ వేడుక చెన్నై కొరట్టూరు అగ్రహారంలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె. ఎం. నాయుడు అధ్యక్షత వహించారు. ఆంధ్ర కళా స్రవంతి కార్యదర్శి జె. శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు పి. సరస్వతి, కార్యనిర్వాహక సభ్యులు ఓ. మనోహరన్, ఈ. బాలాజీ, ఆలయ కమిటీ సభ్యురాలు జె. రాధిక తదితరులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం తెలుగు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జె. ఎం. నాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆంధ్ర కళా స్రవంతి తరఫున క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నామని, 2025 క్యాలెండర్‌ను కూడా అదే ఉద్దేశంతో విడుదల చేసినట్లు తెలిపారు. నగరంలోని తెలుగు వారందరికీ ఈ క్యాలెండర్‌ను ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.

రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర కళా స్రవంతి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి